పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

339


మేనితొడవులెల్ల మృగయుని కిచ్చితి
నిప్పు డిద్దఱికిని నేమి యిత్తు.

75


క.

ఆతురుఁడు దానపాత్రము
చేతం గలయదియె దానసిద్ధి యగుట ధా
త్రీతలపతి దలఁచి కృపా
న్వీతుండై యొక్క ఘటిక నిచ్చెద ననుచున్.

76


వ.

రెండు ఘుటికలు రెండుచేతుల నిడ కొని రస మిది సర్వలోహకాంచనీకరణంబు రసాయనం బిది జరామృత్యుహరణంబు వీనిలో నొకటి మీ రిద్దఱం బుచ్చుకొనుం డనినం దండ్రి జరాజీర్ణుం డగుటం జేసి రసాయనం బిమ్మనిన.

77


ఆ.

ఇతనిమాట పొసఁగ దెల్లలోహంబుల
నూనినంతఁ బసిఁడిగా నొనర్చు
రసమె యిమ్ము నాకు రాజ నయ్యెద నన్న
దండ్రి వచ్చి కొడుకుఁ దలఁగఁద్రోచె.

78


వ.

ఇట్లు పరస్పరభిన్నమనోరథం బగు దుర్వాదంబున శిఖ లూడ దోవతులు వదలఁ దమఛాందసోక్తుల నేన ము న్నాశ్రయించినవాఁడ నింక నీ వడుగకు మనుచుం ద్రోపుత్రోపులాడంగ నెడసొచ్చి.

79


క.

ఇటు మీలోపల నూరక
చిటిపొటి వల దైన మీకుఁ జిత్తప్రియసం
ఘటనము సేసెద నని రస
ఘుటికలు నృపుఁ డిద్దఱకును గొంకక యిచ్చెన్.

80


శా.

ఇష్టార్థప్రతిపాదనన్ ద్విజులఁ దా నీరీతి నత్యంతసం
తుష్టస్వాంతులఁ జేసి వీడుకొని ప్రత్యుద్యోతమౌ సేన సం