పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

సింహాసన ద్వాత్రింశిక


క.

ఆవటము క్రిందఁ దలిరుల
నావటముగ శయ్య దీర్చి యందు సమస్త
క్ష్మావరమణికోటీర
స్థావరనిజశాసనుండు శయితుం డయ్యెన్.

62


వ.

ఆవేళ నాతరుశాఖాంతరంబున నున్న చిరజీవి యను వృద్ధపక్షీశ్వరుండు తనచుట్టు వచ్చి యున్నపిట్టలం జూచి మీరు దిరిగిన వనంబుల నపూర్వంబు లేమి గంటి రని యడిగిన వానిలోఁ గుక్షింభరికుం డనువిహంగం బోస్వామీ నీ వెఱుంగని యపూర్వంబులు లే వట్లున్నను నొకటివవింటి నవధరింపుము.

63


మ.

ఖగవంశోత్తమ నేఁడు గుంపుగ నుషఃకాలంబున న్వేడ్కతో
గగనా భోగము నిండ నే మెగసి పక్షశ్రేణివాతోద్ధతి
న్నగము ల్దూలఁగఁ బోయి వింధ్యముచఱి న్నానాదిగంతాగతం
బగు నాత్మీయగణంబుఁ గూడి యొకపుణ్యారణ్యమధ్యంబునన్.

64


క.

కంకాలఖండనుండను
కంకము విహగములు గొలువఁగా నిజమిత్రా
తకం బగుశోకాంబుధిఁ
గ్రుంకఁగ నేగితిమి వానికుంచుట దెలియన్.

65


క.

ఏఁగినఁ నాతం దశ్రులు
దోగిననయనములఁ జూపు దోఁపక తనలోఁ
గ్రాఁగుచునుండఁగ నేమా
పాఁ గెఱిఁగినభంగి నొయ్యఁ బలికితి మతనిన్.

66


క.

పిట్టలము మేము నీకల
చుట్టాలము మమ్ము నేల చూడవు నీకి
పట్టున వలవనిశోకము
పుట్టెడుకత మేమి చెప్పు పొందుపడంగన్.

67