పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సింహాసన ద్వాత్రింశిక

తృతీయాశ్వాసము

నాలుగవబొమ్మ కథ

క. శ్రీరమణీరమణపదాం
భోరుహజాతాపగాంబు[1]పూరసితడిం
డీరశకలానుకారా
కారామృతకిరణధారిఁ గందర్పారిన్. 1

మ. తనచిత్తాబ్జములోఁ దలంచి మఱియున్ ధారావిభుం డిష్టశా
కునికజ్యోతిషికాగమజ్ఞుల హితక్షోణీశులం గూర్చి శో
భనలగ్నంబున నెక్కఁబూనికొని తత్ప్రాంతంబు చేరంగ నా
సనపాఁంచాలిక నిల్వు నిల్వు మని యాశ్చర్యంబుగా నిట్లనున్. 2

క. పఱతెంచెద విచ్చోటికి[2]
నెఱయంగా విక్రమార్కనృపతికి సరిగా
నెఱిఁ జేసిన యుపకారం
బెఱిఁగెడు సద్గుణము లేక యెక్కం దరమే. 3

క. అనవుడు భోజుఁడు విస్మయ
మును లజ్జయుఁ బెనఁగొనంగ ముద మెడలఁగ మీ
జనపతియుపకారజ్ఞత
యనువొందఁగఁ జెప్పు మనుడు నది ఇట్లనియెన్. 4

  1. జాతామలాంబు
  2. విచటికి విను