ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సింహాసన ద్వాత్రింశిక
తృతీయాశ్వాసము
నాలుగవబొమ్మ కథ
క. శ్రీరమణీరమణపదాం
భోరుహజాతాపగాంబు[1]పూరసితడిం
డీరశకలానుకారా
కారామృతకిరణధారిఁ గందర్పారిన్. 1
మ. తనచిత్తాబ్జములోఁ దలంచి మఱియున్ ధారావిభుం డిష్టశా
కునికజ్యోతిషికాగమజ్ఞుల హితక్షోణీశులం గూర్చి శో
భనలగ్నంబున నెక్కఁబూనికొని తత్ప్రాంతంబు చేరంగ నా
సనపాఁంచాలిక నిల్వు నిల్వు మని యాశ్చర్యంబుగా నిట్లనున్. 2
క. పఱతెంచెద విచ్చోటికి[2]
నెఱయంగా విక్రమార్కనృపతికి సరిగా
నెఱిఁ జేసిన యుపకారం
బెఱిఁగెడు సద్గుణము లేక యెక్కం దరమే. 3
క. అనవుడు భోజుఁడు విస్మయ
మును లజ్జయుఁ బెనఁగొనంగ ముద మెడలఁగ మీ
జనపతియుపకారజ్ఞత
యనువొందఁగఁ జెప్పు మనుడు నది ఇట్లనియెన్. 4