పుట:సకలనీతికథానిధానము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

సకలనీతికథానిధానము


వ.

అని విప్రశవవదనంబు చూపిన భూరమణుండు గోపించి యజ్జారిణికి గర్ణచ్ఛేదనంబునుం జేయించి యాచోరుణికిం దళవాయిపట్టంబు నిచ్చెనని కీరద్వయంబునుం గథలు చెప్పి శాపముక్తులై చనిరి. స్త్రీపురుషులలో పాపం బెవ్వఁరిదని యడిగిన.

143


క.

వనితలకు సాహసంబును
ననృతంబును మార్జుతనము నదయతయును న
ర్మనమును మాయయు ఖలవ
ర్తనమును నిస్స్నేహితయును దప్పనిగుణముల్.

144


వ.

పురుషుండు పాపభీరుం డయ్యును పాపంబునకు జొచ్చెం గావున పురుషుం బేతాళుం డెప్పటియ ట్లన్యగ్రోధంబు నాశ్రయించిన పట్టితెచ్చునెడ నిట్లనియె.

145


సీ.

శరభాంకపురి యేలు శౌద్రకుండను రాజు
        సోమప్రభానామ సుదతి దనకుఁ
బత్నిగా ధర యెల్లఁ బాలింప మాళవ
        ధరణివిప్రుఁడు వీరవరుఁ డనంగ
కరవాలధారియై యరుదెంచి శూద్రకు
        చేజీతమంది యిచ్చిన ధనంబు
దేశభూదేవతాతిధియాచకులకు రూ
        కలు చతుశ్శతము నిక్కముగ నొసఁగి


తే.

యున్నరూకలు నూటగృహోచితంబు
తీర్చు నేనూరురూకలు దినదినంబు
నృపతి వెట్టంగ బగలురాత్రియును గొల్చి
నిద్ర యెఱుఁగక యుండు దా నేర్పు మెరసి.

146


వ.

అంత నొక్కనా డర్ధరాత్రసమయంబున.

147