పుట:సకలనీతికథానిధానము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

87


సీ.

హర్షపురంబున కధిపతి ధర్ముండు
        వసుధ యేలగ ధనవంతు డనెడి
కోమటి గారాపుగూఁతురు వసుమతి
        కోమలి నొకవైశ్యు కొడుకు కిచ్చి
తనకు బుత్రుఁడు లేమి తనపుత్రి యింటనె
        యుండంగ కన్య దా యువతి యగుచు
నొకవిప్రతనయుతో నొనగూడి మెలగంగ
        నంత నప్పతి వచ్చి[1] యత్తమామ


తే.

లల్లు నొద్దకుఁ గూఁతును ననుపుటయును
నధిపు గవియక నిద్రితుండైన తరిని
బ్రాహ్మణుం డున్నచోటి కబ్భామ నడచె
తస్కరుఁ డొకండు వెంటనె తగిలి చనఁగ.

139


వ.

ఉద్యానంబు ప్రవేశించు నంతకుమున్న యవ్విప్రునిం జోరులు మక్కించినం గొనప్రాణములతోనున్న విప్రకుమారుని గౌఁగిలించుకొని చుంబింపంబోయిన నతండు ముక్కు గరుచుకొని మరణంబు నొందిన నింటికి వచ్చి మగండు ముక్కు గోసెనని కుయ్యువెట్టుటయును.

140


క.

నేరం బెఱుఁగని మత్సుత
గ్రూరుండై మగడు ముక్కు గోసె నటంచున్
భూరమణున కెఱిఁగించిన
క్ష్మారమణుఁడు వైశ్యపుత్రు జంపగ బంపెన్.

141


ఆ.

దొంగ నృపతి కనియె దోషి గాఁ డీతఁడు
ద్విజశవంబుతోఁడ వెలఁది పెనఁగ
ముక్కు గరచి ప్రాణముల బాసె విప్రుండు
వానినోట జిక్కె వనితముక్కు.

142
  1. రాగ