పుట:సకలనీతికథానిధానము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

సకలనీతికథానిధానము


సాహసోదారరక్షా విక్రమాఢ్యుండు
        ఘోరరిపువ్రాతకుముదహేళి
భూరగస్వర్లోకపూర్ణసద్గుణరాశి
        నిర్భయదాననిర్నిద్రమూర్తి


తే.

దానధర్మోపకారవిద్యాప్రతాప
సత్యశౌచక్రియాబలాశ్చర్యశౌర్య
భూషణుఁడు దీనయాచకపోషణుండు
విక్రమార్కుండు జగదేకవిశ్రుతుండు.

3


వ.

అని యతనిగుణంబులు ప్రశంసించి నీకతంబున శాపముక్తుల మైతి మనిన మీ కీశాపం బెట్లు వచ్చెననిన నాపుత్రికాస్త్రీ లిట్లనిరి.

4


క.

గిరిజకు సఖులగు మే మా
హరునిన్ మోహింప నెఱిఁగి యద్రిజ మమ్మున్
బరికించి శాపమిచ్చెను
పరుపడి నీగద్దెయందు ప్రతిమలు గాఁగన్.

5


వ.

అని చెప్పి యధాస్థానంబున కరిగిన భోజుం డాసింహాసనం బెక్కక యుమామహేశ్వరప్రతిష్ఠ గావించి కొలుచుచుండె ననిస నభ్భోజునిజన్మంబు చెప్పుమనిన నారదుం డిట్లనియె.

6


ఉ.

ముండికుడాప్రయాగ వసుముఖ్యము లొల్లక తీర్థవాసులన్
ముండన మాచరించునెడ ముగ్గురుముండలు వచ్చి యందులో
రండ యొకర్తి యాత్మపతి రాజుగ గోరి త్రివేణి గూలె నా
రెండవముండయుం బ్రియధురీణ మనోహరుగా దలంపుచున్.

7