పుట:సకలనీతికథానిధానము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

61


వ.

తొల్లిటి యట్ల మంచ డిగ్గి యప్పటిగుయ్యిడిన భోజుండు విస్మితుండై యమాత్యుని నడుగుటయును నతండిట్లనియె.

353


క.

విత్తంబుమీఁదనుండిన
మత్తుండై పలుకునట్టి మానవుఁడైనన్
విత్తము ప్రలాపయుతమని
చిత్తంబునఁ దలఁచి వ్రయము సేయుదు రార్యుల్.

354


వ.

అట్లుగావున నితండెక్కిన మంచెక్రింద నధికధనం బుండ బోలు నది శోధింపవలయు ననిన నబ్భోజుండు.

355


క.

[1].......త్రమునకు
భూవరుఁడును ద్విగుణమిచ్చి భూఖనికులకున్
క్ష్మావిభుఁడు మంచెక్రిందను
భూవివరము సేయుమనుచు బొందుగ బలికెన్.

356


క.

జనపతియానతిచే నా
ఖనికులు ధర ద్రవ్వ నచట గనుపట్టె లస
త్కనకమణిరుచులు వెలుగును
ఘనసింహాసనము పుత్రికాసహితంబై.

357


వ.

అది మోయించుకొని ధారాపురంబునకుం జనియెననుటయును.

358


తే.

అట్టిసింహాసనము భోజుఁ డాత్మపురికి
యివ్విధంబున గొనిపోయి యేమిచేసె
నద్బుతంబయ్యె నది నాకు నానతిమ్ము
బ్రహ్మఋషివర్య! ఆదిమబ్రహ్మపుత్ర!

359
  1. ఆవిప్రక్షేత్రమునకు