పుట:సకలనీతికథానిధానము.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

సకలనీతికథానిధానము


క.

అనుటయు మంత్రికుమారులు
విని నీకు శశాంకవతియ వేగమె చేరున్
మనమున నూరడు మన సృప
తనయుం డిట్లనియె మంత్రితనయులతోడన్.

104


సీ.

కందర్పసేనుఁ డుత్కటబలుం డడిగిన
        నిచ్చునో యీఁడొ! నిజేచ్ఛుఁ డతఁడు
మగధాధిపతి కాశిమహిపతికూతురు
        నడిగిన నీకున్న నతనిమంత్రి
యతిరూపులై శిష్యు లరుదేరఁ గాశికి
        నరిగి రాత్రి చరింప హస్తిపాలు
పొలఁతి దొంగలు గొనిపోవఁ బల్కెను నన్ను
        విడువుండు వేగ మద్విభుఁడు వచ్చు


ననిన వారు విడక చనుటయు సిగ్గున
విషము ద్రాఁగి కరిణి విభుఁడు వడిన
కపటితపసివవిషము గ్రక్కున నడ
గించి చోరముషితపత్ని చొప్పు చెప్ప.

105


గీ.

వాఁడు చెప్పినఁ జని చోరవధ యొనర్చి
పత్ని గొనివచ్చి యతనికి భక్తి మ్రొక్కి
యతనిఁ దనయిల్లు చూడరమ్మనుచుఁ గొనుచు
నరిగి తనయింట నునిచిన నర్ధరాత్రి.

106


ఉ.

నాగమొకండు వచ్చి మదనాగము ముక్కునఁ బట్ట నేనుఁ గా
నాగవిషాగ్నిఁ గ్రాల నది గ్రక్కున డించి నృపాలపూజ్యుఁడై
యాగురుమూర్తి తత్తనయ నాత్మనృపాలునిసొమ్ము చేసె నీ
యోగి సముద్ధరించిన మహోన్నతసిద్ధులు చేరకుండునే.

107