పుట:సకలనీతికథానిధానము.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

273


సీ.

తక్షసిలాపురీధవుఁడు భద్రాక్షుండు
        పుత్రార్థియై యష్టపుష్కరమున
శ్రీగూర్చి హోమంబు సేయ నొక్కటి దక్కు
        వైన హృదబ్జంబునందు వ్రేల్వ
మెచ్చి కుమారుని నిచ్చినఁ బుష్కరా
        క్షుండని పెంపంగ సుతుఁడు పెరిగి
.............................
        ............................


గీ.

తామ్రలిప్తాఖ్యపురమున ధర్మసేనుఁ
డనెడు వైశ్యుఁడు చోరప్రహార్తుఁ డగుచు
హంసమిథునంబు జూచుచు నసువు విడిచె
నతనిభార్యయు పతితోన నగ్ని జొచ్చె.

108


క.

ప్రాణాంతంబున నరుఁ డే
ప్రాణిని వీక్షించు నవ్యభవమున వాఁ డా
ప్రాణి యగుఁగాన నూరుజ
సూనుండును హంస యయ్యెను సుదతీయుతుఁడై.

109


సీ.

ఆగతి హంసయై యభ్రపదంబున
        లలనయుఁ దా గమలంబు గఱచి
చనుచోట నొకభిల్లి శరమున నేసిన
        నలినంబు తద్వదనమున బాసి
సిద్ధుఁడు పూజించు శివుమీఁద పడుటయు
        నది పూజగా హరుఁ డవధరించి
భూవిభుఁ జేసె నప్పువ్వుబోణియు వేగ
        విద్యాధరత్వంబు వెలయఁ దాల్చె