పుట:సకలనీతికథానిధానము.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

155


క.

కొమ్ములుగలవానిని నఖ
రమ్ములుగలవాని శస్త్రరతుఁడగువానిన్
నమ్మిక దీయఁగ వలవదు
చిమ్మును నాటించు జంపు చేరగ నేలా.

138


వ.

అట్లు గావున.

139


క.

నమ్మంగవలదు నందకుఁ
గొమ్ములు చూపెడిని, వాని గుణ మెట్టిదియో
నెమ్మి గలదేని నొకవ
ర్షమ్మున నాజాడ చూడు సత్యకులేంద్రా.

140


వ.

అనునంత నొకయకాలవర్షమ్ము గురిసిన నందకు రమ్మని పిలువ బంపుటయును.

141


క.

వానకు తలవంపుచు న
ద్ధేనునుతుం డరుగదేర దృష్టించి శివా
జ్ఞానంబు మెచ్చి కేసరి
యానందకు కంఠ మలమ నది చిమ్ముటయున్.

142


క.

సింగంబు పండ్లు నాటిన
నంగము దొరగుచును నందుఁ డాయతరేఖా
శృంగములఁ జిమ్మ హరియు న
ణంగెను విధి చేయుపనికి నాగగ వశమా!

143


వ.

అని కథ చెప్పి దాదిం చూచి మఱియు నిట్లనియె.

144


ఆ.

సహజరిపుఁడు తానె జావంగఁ జూడక
చేరఁదిగిచి రక్ష చేసిరేని
వానిచేత దా రవశ్యము జత్తురు
సర్పహతిని హరులు చచ్చినట్లు.

145