పుట:సకలనీతికథానిధానము.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

సకలనీతికథానిధానము


వ.

అని మఱియు నిట్లనియె.

132


సీ.

..........................
        ............................
పితృభూమి బడియున్న పీనుగు నడుగు మీ
        వనవుడు బోయి వాఁ డడుగుటయును
నుజ్జినిపురవర మొద్ద నుండిన మఱ్ఱి
        క్రిందని చెప్పం బుళిందు డపుడు?
దానభోగక్రియాధర్మాత్ముఁడై యుండ
        మృత్యువు చక్కనిమెలఁత యగుచు


తే.

నాతనికిఁ బత్నియై యొక్కయవసరమున
నతఁడుఁ దానును బండెక్కి యరుగుచుండ
గొఱ్ఱె పోయినదని పుఱి గొల్లవారు
చూడ మృత్యువు గొఱ్ఱెయై సొగయుటయును.

133


క.

ఇదిగో మాగొఱ్ఱియ యని
యది రాజున కెఱుఁగ జెప్ప నాతస్కరునిన్
పదిలముగ మఱ్ఱిక్రిందను
వధియింపగఁ బంపె వాని వసుధేశ్వరుడున్.

134


వ.

అట్లు గావున.

135


క.

ఏవలన వచ్చి పొందునొ
దైవికమునుఁ దప్పఁ ద్రోవ ధాతకు వశమా
దైవికమె ప్రధానమ్ముగ
భావింపగ మానుషంబుపని యేమిటికిన్.

136


వ.

అని నందకు వీడ్కొని యజ్జంబుకంబు చండపింగళుండను సింహంబుముందటికిం జని యిట్లనియె.

137