Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశపు ఖనిజసంపద - 1


నొద్ద గోదావరిలోకూడ రవ్వలు దొరకినవి. బంగనపల్లె గుండ్లపొరనుంచి లభించిన వజ్రములు ఎక్కువభాగము చిన్నవైనను దీనికి దూరముననున్న కృష్ణానది గర్భములోను, గ్రానైట్ నైసులలోను పెద్ద వజ్రములు దొరికేవట. కోల్లూరు, పరిటాల గనులు గుంటూరు, కృష్ణాజిల్లాలలో కృష్ణ ఒడ్డుననే యున్నవి. ఇప్పటికి పాతగను లున్న చాల చోట్ల వర్షము కురిసిన వెంటనే రవ్వలు భూమి పై మెరయును. ఈ నదీశయ్యలలోను, గుత్తి, పత్తికొండ తాలూకాలలోను, బంగనపల్లె గుండ్లపొరలోను, వజ్రములకై వెదుకదగిన ప్రాంతము చాలగలదు.

ఇనుము (Iron) :- ఆంధ్రలో ఉక్షువరిశ్రమకు చాలిన లోహామ్లజనిదము లేక హిమటైట్ (Haematite) నిధులు లేవు. అనంతపురం జిల్లా రాయదుర్గము తాలూకాలోని రాగికొండలలో నూటికి 60 పాళ్ళు ఇనుమున్న హిమటైట్ ధాతువు 5 లక్షల టన్నులు కలదు. ఇది ధార్వార సంహతికి చెందిన హిమటైట్ క్వార్ట్ జెట్లలో ( Haematite Quartzites) నున్నది. కర్నూలుజిల్లాలో రామల్లకోట, వెల్దుర్తి ప్రాంతమున భూకంపములతో బ్రద్దలైన కడపరాళ్ళలో 51 నుంచి 65 పాళ్ళు ఇనుమున్న హిమ టైట్ ధాతువు 37 లక్షల టన్నులు దొరకును, ఇనుము తక్కువపాలుగల చిన్న హిమటైట్ నిధులు కడప జిల్లాలో చాబలివద్ద పులివెండ్ల క్వార్టు జైట్లలోను, మాగ్న టైట్ క్వార్టుజైట్లు విరివిగా గుంటూరు, నెల్లూరు జిల్లాలలోను ఉన్నవి. కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట పరిసరాలలో నేలమట్టమునందు కూడిన పలుచని ఇనుపరాళ్ళ పొర యొకటి కలదు. ఇక్కడ 61 పాళ్ళు ఇనుముకల హిమ టైట్ ధాతువు 25 లక్షల టన్నులు దొరకును.

రాగి (Copper), సీసము (Lead): విజయనగర సామ్రాజ్యపు రోజులనాటి పాత రాగిగనులు నెల్లూరు జిల్లాలో గిరి మెన పెంట, కర్నూలుజిల్లాలో గని, గుంటూరు జిల్లాలో అగ్ని గుండాలవద్ద కలవు. ఈ చోట్ల రాగి ఖనిజమగు మాలకైట్ (Malachite) తో కూడిన పలుగురాతి నాళములు వేర్వేరు రాళ్ళను చొచ్చియున్నవి. 1800 తరువాత గరిమెన పెంట గని యొద్ద తిరిగి త్రవ్వెడు ప్రయత్నాలు జరిగి, కొన్ని నిష్పలమై, కొన్ని ఇతర కారణముల వలన ఆగిపోయినవి. ఈ స్థలములలో భూభౌతిక పరిశోధనలు జరుగుచున్నవి. కాని ఇంతవరకు లాభకరముగా త్రవ్వదగ్గ నిధులున్నట్లు నిరూపింప బడలేదు.

వెండితోకూడిన సీస,గంధకిదము, గెలీనా (Galena), కడప, కర్నూలు, గుంటూరు, చిత్తూరు జిల్లాలలో కొన్నిచోట్ల సూక్ష్మముగ గలదు. కర్నూలు జిల్లా ద్రోణాచలము తాలూకాలో చిత్యాలవద్ద గ్రానైట్ నెర్రెలలో చెదరి వ్యాపించిన చిన్న నిధులను 30 ఏండ్ల క్రిందట త్రవ్వి, నష్టకరమని మానివేసిరి. *ఈ గనులున్న కొన్ని చోట్ల బోరింగులతో లోతున ధాతువెంతయున్నది తెలిసికోనగును.

కురువిందము (కోరండం), ఎఱ్ఱరాయి (గార్నెటు):- కోరండం, గార్నెట్ మిక్కిలి కఠినమైన ఖనిజములు గనుక, వీనిని మెరుగు పనులకును, కురువిందమును (corundum) సానచక్రములకును, వాడుదురు. కురువింద నిధులు అనంతపురం జిల్లాలో అనంతపురం, కల్యాణదుర్గం, ధర్మవరం, హిందూపురం తాలూకాలలో అతి క్షారశిలలలోను (Ultrabasic Rocks), సయనైట్రలోను (Syenites), కొన్నిచోట్ల కలవని వ్రాసిరి. ఇవి పరీక్షింపదగినవి. ఇదివరకు హిందూపురం తాలూకాలో పరిగినుండి చాల ఖనిజము ఎగుమతి చేయబడినది. గార్నెట్ నెల్లూరు జిల్లాలో గిద్దలూరు, సై దాపురము మున్నగుచోట్ల అభ్రక విభాజీయ శిలలలోను, తూర్పు కనుమలలో భోండలైట్ చార్నొకైట్లలో ప్రవహించు వాగుల ఇసుకలోను విరివిగ లభించును. విద్యుత్తు చౌకగా దొరకినప్పుడు, ఇతర పరిశ్రమలతోపాటు ఈ ఖనిజములనుండి మెరుగు పదార్థములను అధికముగ తయారు చేయవచ్చును.

'ఇతర ఖనిజములూ :- 1,800° సెం. వేడిని, విద్యుత్తును నిరోధించు కయనైట్, సిల్లిమనైట్ ఖనిజములు గ్లాసు కొలుములలోను, విద్యుత్పింగాణి మున్నగువాటిలోను, నుపయోగపడుచున్నవి. కయనైట్ నిధులు నెల్లూరు


  • గుంటూరులో కారెంపూడి సమీపమున గెలీనా ఇతర గంధకిద ఖనిజములతోకూడి, కడపసంహతికి చెందిన డోలోమైట్ లైంస్టోన్లలో (Dolomitic Limestons) కొంతదూరము వ్యాపించి యున్నది. ఈచోట్ల గెలీనా లోతులో అధికముగా నుండు అవకాశములున్నవి.