Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజంతా ఈ చిత్రలేఖన మత్యుత్తమ వైజ్ఞానిక లక్షణములను కలిగి యుండుటేకాక మార్ధవ సౌందర్య చిహ్నితమైన పనితన మునుగూడ ప్రదర్శించుచున్నది. ఈ గచ్చు చిత్రమున పసుపుపచ్చమన్ను, జేగురు మన్ను, ఆకుపచ్చ మన్ను (Terra Verta), దీపపు మసి మున్నగునవి రంగుల కుప యోగింప బడినవి. అధరోష్ఠమునకును, కంటి కొలుకు లకును చిత్రకారు డెఱ్ఱమట్టినుండి (Red-ochre) తయారు చేయబడిన ఒకరక మైన కెంపు వన్నెను వాడియున్నాడు. వెలుతురు నీడలను సూచించుటకు ఒకటవ రెండవ గుహ లందలి తరువాతి గచ్చు బొమ్మలలో కనవచ్చు లేత ముదురురంగు లువ యోగింపబడియుండలేదు. దేహముల బాహ్యరేఖలు ముదురు కెంపులో కాని, నలుపులో శాసి వ్రాయబడినవి. చిత్రణము స్థిరమును లలితమునై యున్నది. శరీరములు నిశ్చల మృతవిన్యాసములతో కాక జీవక ళతో నుట్టిపడుచున్నట్లుగా చిత్రింపబడియున్నవి. క్రీ. పూ. మొదటి శతాబ్ది యందలి చిత్రలేఖనము : తొమ్మిదవ గుహయం రెడమభాగమున గల స్తంభము లపై నున్న చిత్రములలో నొక్క చిత్రము మాత్రమే క్రీ. పూ. మొదటి శతాబ్దిలో చిత్రింపబడినట్లు తలపబడు చున్నది. ఈ గచ్చుబొమ్మ భీమబలుడైన ఒక పౌరాణిక గోపా లుని కథను సూచించు చున్నది. అతడు కంఠములను, తోకలను పట్టుకొని క్రూరములైన వన్యమృగముల చల నములను గూడ అరికట్ట గలడు. ఆ గోపాలుడు మిక్కిలి సుందరాకారుడు. అతని విలాస ప్రవృత్తిలో మధురా బృందావన శాద్వలములందు గోవులను కాచిన గోపాల కృష్ణుని సాదృశ్యము కొంతవరకు కనవచ్చు చున్నది. ఈ సన్ని వేళ మే కుద (Kuda) నాసిక్ మున్నగు నీతర స్థలములందుకూడ చెక్కబడి యుండుటచే ఆకాలవు బౌద్ధ చిత్రకారులయందు . అది బహుళ ప్రచారము నంది యున్నట్లు కానబడుచున్నది. ఈ గచ్చుబొమ్మ చైత్యనిర్మాణముతో సమకాలిక మై యుండుననుట స్పష్టమె. క్రీ. పూ. మొదటి శతాబ్దిలో కూడ అజంతా చిత్రకారులు తమ కళా ప్రతిభ భావింప జాలిన ఏ విన్యాసముతోనైనను బొమ్మలను చిత్రింప గలిగి యుండుటయు, శారీరక చలనమును, సంఘర్షణమును 14 105 సునాయాసముగా సూచింప గలిగియుండుటయు వింత కలిగించును. వ్యవధానము :- క్రీ. పూ. మొదటి శతాబ్దినుండి క్రీ. శ. 8వ శతాబ్ది వరకు భారతదేశ చిత్రకళా చరిత్రలో కొంత వ్యవధానమున్నది. తొమ్మిదవ పదవ గుహల లోని కొన్ని చిత్రములకు ఆధార రహితముగనే కొంత ప్రాచీనత నాపాదించుచు, కొందరు గ్రంథకర్త లీ వ్యవ ధానము లేదని చెప్పుటకు యత్నించినారు. శిల్ప వాస్తు కళా చరిత్రములందు సైతము అట్టి వ్యవధాన ముండుటను పరికించి చూచినచో, అజంతాలో సుమారు నాలుగు శతాబ్దుల కాలము సృజనశక్తి లోపించియుండెనని నిశ్చ యించుట యుచితముగా ఉండును. శాతవాహన సామ్రా జ్యము యొక్క కేంద్రము అమరావతికిని, ఆ సామ్రాజ్య మునకు సంబంధించిన ప్రాగ్భాగమునకును, మారుట యో క్షాత్రపులకును, ఆంధ్ర శాతవాహనులకును నిరంతర యుద్ధములు జరుగుచుండుటచే శాతవాహను లా భాగ మున శ్రద్ధవహింపకపోవుటయో, రాత్రవులు సైతము స్థిరపడి లలితకళాదులను పోషించుటకు తగిన అధికార మును సంపాదింపజాలకపోవుటయో దానికి కారణమై యుండును. క్రీ, శ. మూడవ శతాబ్దిలోని చిత్రలేఖనము :- పద వ గుహలోని కుడిగోడ మీద చిత్రింపబడిన పడ్డంత జాతక ముతో ఒక శాసనము కూడ చిత్రితమై యున్నది. అది బహుళః మూడవ శతాబ్దిదని నిశ్చయింపబడిన ఆ చిత్ర ముతో సంబంధించినదేయై ఉండును. అందుచే ఈ చిత్రము భారతీయ చిత్రలేఖన చరిత్రలో తరువాతి గొప్ప ఘట్ట ముగా కానబడుచున్నది. దాని నిచ్చట కొంత సవివర ముగా పరిశీలన చేయవచ్చును. చిత్రకారుడు పడ్డంత జాతకములోని పర్వ సన్నివేశ ములను చిత్రించినాడు కాని వాని క్రమము కొంత మార్చినాడు. అతడు నక్రములతోను, అజగరములతోను (Pythons) గూడిన బురద నేలలు గల దుర్గమమైన అడవి లోని గజముల వన్యజీవితముతో ఆరంభించి, మానవ మూర్తులతో నిండిన ప్రాసాద దృశ్యములతోను, ఒక స్తూపము తోడను, విహారముల తోడను గూడిన పవిత్ర క్షేత్రమునకు పోవుచున్న రాజాంతఃపుర పరివారము