పుట:శ్రీ సుందరకాండ.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 22


        41
దానవేంద్ర ! నీ దర్పబలార్జిత
భోగభాగ్యములు ముచ్చట తీరగ,
అనుభవింప వ్రాయడు పరమేష్ఠియె
దీని నొసట బాధింపగ నేటికి ?
        42
కామించని అంగనతో కలయిక
మనసును తనువును మలమల కాల్చును,
వలచు వనితతో వలరాచఱికము
ప్రీతినిచ్చి ఈప్సితమును తీర్చును.
        43
తచ్చనలాడుచు ధాన్యమాలినియు
వాటున బిగియగ పట్టె దశాస్యుని,
మెత్తగిల్లె నవమేఘశ్యామల
మసృణాంగుండగు అసురస్వామియు.
       44
దశకంఠుడు అంతట అశోకవని
విడిచి, నేల కంపింపగా నడిచి,
భానువలయ దీప్తంబగు రాజ భ
వనము ప్రవేశించెను సంభ్రమమున.
       45
ఆవరించిరపు డసురేశ్వరు గం
ధర్వ యక్ష సుర నాగ కన్యకలు,
ఉదురుపాటునన్ గుదిగొని అందఱు,
చొచ్చిరి రావణు శోభన సదనము.
       46
ధర్మపథమును వదలని మనస్విని
సీత నటుల తర్జించి, రావణుడు
వేసరిలి విడిచి వెళ్ళి, ప్రవేశిం
చెను భాస్వరమగు స్వీయసౌధమును.

196

18-3-1967