పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయోధ్యాకాండము

487

అని మ్రానుఁ గన్నిడి - యవనిపైఁద్రెళ్ళి
పెనుమూర్ఛ పాల్పడ - పృథివీశుఁజూచి 5920
కౌసల్య చాల శో - కమున నిల్పోప
కా సుమంత్రుని తోడ - యడలుచుఁ బలికె.

—: కౌసల్య శోకింపఁగా సుమంత్రుఁ డూఱడించుట :—


"నన్ను మారాము చెం - తకుఁ గొనిపోవ
వన్న నాయాపద - కడ్డమై నీవు
అరదంబు దెప్పింపు - మటుసేయవేని
మఱలితెల్పుము నాదు - మాట రామునకు
కాదని పల్కినం - గైకేయి కల్ల
నీదుపూనికె నేఁడు - నిక్కంబుగాఁగ
యిచ్చెదఁ బ్రాణంబు - లివె నీవుచూచి
మెచ్చుచుఁ దలఁతువా - మీఁద నేనియును” 5930
అనిపలికి సుమంత్రు - డా సాధ్విఁజూచి
వినయ పూర్వకముగా - వినుమంచుఁ బలికె.
“ఏలమ్మ! దేవి! నీ - విటునన్నుఁ బలుకఁ
బోలునే వనుల నీ - పుత్రుఁ డున్నాఁడు
జానకి లక్ష్మణుల్ - సతతంబు రాముఁ
గానలఁ గొలిచి సౌ - ఖ్యమున నున్నారు.
మునువును తాక్లేశ - ముల నంది నటుల
తనప్రాణనాయకు - దండ నుద్యాన
వనులలోఁ గ్రీడించు - వైఖరి భయము
తనమది లేక సం - తసమందె సీత 5940