పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయోధ్యాకాండము

263

—: వసిష్ఠుఁడు రామునుపవాసముండుమని చెప్పుట :—


"మీరలు పరమ ధా - ర్మికుఁడైన యట్టి
శ్రీరాముకీర్తి ల - క్ష్మీ వసుంధరలు 480
వరియించుటకు ను - పచారంబు జనక
ధరణీశ చంద్రుని - తనయతోఁగూడ
నుంచి రండనుచు ని - యోగింప నతఁడు
కాంచనరథము పై - కదలి రాఘవుని
నగరిలో సావళ్లు - నాలుగు గడచి
తగినవారలు బోయి - తనరాకఁ దెలుప
వేగంబులో రఘు - వీరుఁడువచ్చి
సాగిలి మ్రొక్కినం - జాల దీవించి
యరదంబు డిగ్గి రా - మాన్వితుఁడగుచు
పరమసంయమి - పైఁడి పావలుదొడిగి 490
కొలువుకూటము - చేరి గురురత్నపీఠ
తలమున వసియించి - తానిట్టులనియె
"మీతండ్రి నీయందు - మిక్కిలికరుణ
చేత సామ్రాజ్యాభి - షిక్తునింజేయఁ
దలఁచినవాఁడు సీ - తాసమేతముగ
వలయును నీ వుప - వాసముండుటకు
నల నహుషుండు య - యాతినింబోలె
యిలకుఁ బట్టముగట్ట - నెంచె నిన్నతఁడు"
అని సమంత్రకముగా - నట్లుంచి యతని
యనుమతిఁ గదలి మ - హారథంబెక్కి 500