మ॥ వనితాశీలము నిల్ప శత్రువులఁ దుంప నేడు చిత్తూరు ద
ప్పిన నీలోకము శూన్యమంచుఁ గరముల్ వేయెత్తి ఘోషించేనో
యన సూర్య ధ్వజకోటు లెల్లెడ సహస్రాంశుల్ పిసాళించి న
ర్తన మాడున్ మృదులానిలంబు తమ మీఁదన్ సోఁక హేలాగతిన్ 11
సీ॥ నవ్వనేర్వక మున్నెక్రొవ్విన రిపుకోటిఁ
బాఱంగఁదోలి నవ్వంగ నేర్త్రు
కూర్చుండుటకు మున్నె క్రోధోగ్ర శత్రు వ
క్షోదేశ మెక్కి కూర్చుండ నేర్త్రు
నడువకమున్నె చండ విపక్షమకుట సం
తతులఁ బాదము లుంచి నడువనేర్త్రు
పరువులెత్తక మున్నె పరిపంధి తతి నొంచి
తఱుముచు వెనువెంటఁ బరువ నేర్త్రు
గీ॥ రాడుటకు మున్నె ఘోర రణాంగణముల
నరిశిరంబులతో బంతులాడ నేర్తు
రౌర; చిత్తూర్పురి జనించినట్టి వారు
శైశవము దాఁటుటకు మున్నే శౌర్య మహిమ.12 12
శా॥ ఇంద్రప్రస్థముగాదు ద్వారకయుఁగాదే కాశియున్ గాదు ని
స్తంద్ర ప్రాభవకీర్తి శోభిత మయోధ్యా పట్టణంబేని
దింద్రోపేంద్ర సమానులౌ నృపులు తామేలంగఁ జిత్తూర్మహ
స్సాంద్రశ్రీలను గుత్తకున్ గొనిన యాచందంబు దీపించెడున్. 13
సీ॥ హరితమౌనీంద్రు పాదాబ్జాత యుగళికి
శిష్యుఁడై శుశ్రూష చేయఁ గలిగె
వ్యాఘ్రశైలంబు తాపసు కూర్మిఁగని ద్విధా
రా ఖడ్గమును పొంది రాణ మెఱసె
బ్రమరుల గెలిచి భారత సూర్యుఁ'డని 'విశ్వ
పతి ' యని బిరుదముల్ పడయఁగలిగె
ఖాండహా రిస్పహన్ కాఫరి స్థానాది
యవనసీమలు గెల్చి యశముఁగాంచె
గీ॥ వందలకుఁ బైనఁ బుత్రులఁ బడసి సూర్య
వంశమును నిల్పి సౌపర్వ పర్వతమునఁ
దపముఁ గావించి ముక్తి కాంతను వరించె
బప్పరావు మేవాడ్భూప వంశకర్త.14
భరతఖండముపై యవనుల దండయాత్రలు
సీ॥ తమ యువనదుల సంతతులెల్ల వెండి రే
కులువోలె నెల్లెడ నలముకొనఁగ
జహ్నుకన్యాసింధు సలిలపూరమ్ములు
సారతఁగూర్ప బంగారు పండు
రసఖండమై పచ్చరా బయలులమాడ్కి
లలిత సస్యశ్యామ లంబునగుచుఁ
బిడికెఁడు చోటైన వెలిఁబోవనట్టి యా
ర్యావర్త బహుళ భాగ్యాంక కధల