పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

53



    నొకగని ప్రేలే; ముందుండిన మోగలుల్
            కూలిరి; గోడయుఁ గొంత యురలె;
    దానిలోఁ గొంద ఱంతమునొంది; రీవలా
            వలివారు ముందుకుఁ గలయ దూఁకి;
    రంత బ్రహ్మాండంబు నగలించు నొక పెద్ద
           ధ్వనితోడ నొండొక గనియుఁ బ్రేలె:
           
గీ॥ దాన యవన హైందవుల గాత్రములు గాలిఁ
   గలిసె శతశస్సహస్రశః ఖండము లయి;
   విఱిగె నొకగోడ; యచటఁ బెక్కురు యవనులు
   హైందవులు చేరి; రయ్యె ఘోరాహవంబు.219
   
క॥ రణరంగ మృగేంద్రులు చో
   హణవీరులతోఁ గోటేరియా-బేడ్లా రా
   ణ్మణు లాసమ్మర్ధ రణాం
   గణమునఁ దెగి స్వర్గసీమఁ గట్టిరి గృహముల్. 220
   
క॥ హరవంశ్యుల నడుపుచు నీ
   శ్వరదాసును దేవరాధి పతియును ఝాలే
   శ్వరుఁడును బెండ్లికి నడచిన
   కరణిని నని కేగి మడిసి కనిరి యశంబున్. 221
   
క॥ దురమున దూడాసింగును
   గరుణాసాంద్రుండు వైరి గణ మస్తములన్
   దరుగుచు రాసులు వోసిరి
   పరలోక ద్వారసీమ వఱ కవ్వేళన్ 222
   
క॥ భండనశతఘ్నులనఁ దగు
   చోండావ ద్భటులతో విశుద్ధ యశస్సాం
   ద్రుండైన సాహిదాసుఁడు
   ఖండితుఁడై యొరగె భటులు కళవళ మందన్.223 223
   
క॥ చండనృపాఖండలు కుల
   మండనుఁ డరిదండధరుఁ డమాత్యు డితండున్