52
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
చూడామణియన విశుద్ధి కీర్తి గడించెఁ;
దండ్రి కీతనికి భేదంబువచ్చి
చిననాఁడు తనదేశమును వీడి వెడలె: నీ
తని భుజాటోప దుర్దాంతత విని
చిత్తూరిరాణాయుఁ చేయిచ్చి మన్నించి
బదసూరు సంస్థాన పతిగఁ జేసె;
గీ॥ మహితధై ర్యంబు వజ్ర వర్మంబు గాఁగఁ
దనదు రారోణ్మహా వీర తతులఁ బూన్చి
తగిలి బ్రహ్మాండమైనఁ బిండిగ నొనర్చు
రౌద్రతరధాటిఁ గాలాగ్ని రుద్రుఁడితడు.216
క॥ కృప నాదరించు చిత్తూర్
నృపచంద్రుని పనులు మేని నెత్తురుకండల్
విపులముగ ధారవోసి జ
రుపు స్వామిస్నేహ బంధురుల్ వీరెల్లన్. 217
సీ॥ సమర మనేకమాసములయ్యె ; నక్బరు
పెక్కురు పనివాండ్రఁ బిలువ నంపి
దుర్గంబుక్రింద గోతులను ద్రవ్వించి చొ
ప్పించి యగ్నిరజంబు ప్రేలిపించెఁ;
జిత్తూరిసేన కాచిన నూనియలు శిలల్
గుప్పుచు వైరులఁ గూల్చుచుండె
యవనులు తలలపై శవకోటిఁ గప్పి దు
ర్గము క్రిందఁ ద్రోవంగఁ గడఁగుచుండి:
గీ॥ రెప్పుడును గాని యాగోడ లెచటఁగాని
పగులుటయుఁగాని సేనలోఁ బడుట గాని
కానరాదయ్యె; నక్బరు గడియ గడియ
కెటు లెటు టంచు విసుగు నొందుటయ కాని. 218 218
సీ॥ ఉన్నమం దంతయు నొకమాఱె పెక్కుతా
పులఁబోసి గూరి నిప్పును ఘటింప