పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర




    ప్రళయ కాలాంతకుని బోలుభటులఁ గూడి
    కదన మొనరించి పండె నాగండి దండ. 138

సీ॥ తరువాత రాజమాతయు జవాహిరిబాయి
              రాఠోడుసుత తనుత్రాణ ఖడ్గ
    ములనూని యాస్థలంబునఁ బోరిమడిసె, న
              వ్వెలంది కీర్తిని జరిత్రల సువర్ణ
    పరమాక్షరముల వ్రాసిరి పూజ్యులాది నం
              బంతలో దుర్గ మావంత యవల
    విఱిగె లోపలి వీరవరుల సంఖ్యయుఁ దగ్గె
              నుదయసింహ కుమారుఁడొకఁడు తప్ప
              
గీ॥ రాజ వంశమంతయు రణాగ్రమున మ్రగ్గె
   నతని సురధాని రాయల కప్పగించి
   వెలికి దాఁటించి మిగిలినవీరు లొక్క
   స్థలము చేరిరి కార్యనిశ్చయము కొఱకు. 139
   
సీ॥ గందంపు మంచిచెక్కల నొక్కపోవుగాఁ
             గూర్చి తైలముపోసి కుప్పలుగను
    గర్పూర రజము పైగప్పి యగ్ని రగిల్చి
             వెలఁదులు పదమూఁడువేల మంది
    జలకంబు లాడి దువ్వలువలు సొమ్ములు
             దాలిచి పూచిన తంగేడు లటు
    వెడలి పెండ్లికిఁ బోపువిధమున గుంపులై
             చిఱునవ్వు మోముల సిరులు నింప
             
గీ॥ బంగరు, సలాకలట్లు పావకునిఁ జొచ్చి
    రీవెలఁదులఁ గర్ణావతీదేవి నడిపె
    నామె యుదయసింహకుమారు ననుఁగుఁదల్లి
    దుర్జయార్జున రాయనితోడఁ బుట్టు. 140

మ॥ తమ కాంతామణు లెల్ల వహ్నిఁబడి మందన్ దేవరస్వామి దు
    ర్గము నందుండిన యోధులన్ గొనుచు సూర్యద్వారమున్ దీసి సిం