పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

33



     నడచు సంద్రంబు లనఁగ సైన్యములఁ గొనుచు
     వచ్చి చేరిరి చిత్తూరు పురవరంబు. 133
     
గీ॥ పదము వెన్క మఱల్పని పటు పరాక్ర
   మైకధన్యులు గొలువ సురేశ మల్లు
   సుతుఁడు “భాగ్జీ ” తరలి వచ్చె నితడు బాడ
   బానలముఁ బాఱమ్రింగు మహాభుజుండు. 134
   
గీ॥ అఖిల జగముల లోని శౌర్యంబు ముద్ద
   చేసి దుర్గంబునిండ నుంచినను గానీ
   క్రూరులగు పరంగుల పిరంగులకు ముందుఁ
   దూఁచుకొన రాయి నిలుచట దుర్లభంబు. 135
   
సీ॥ లాబ్రిఖాన్ బిరుద మలంకరించెడు ప్రోడ
               గోతులు త్రవ్వించి, కూరి మందు
     వహ్ని రవుల్ కొల్పి పగిలించె నీతండు
               బహదూరుసాహి సేవలను దనుపు
     బుడుతకీచు పరంగి ముందు 'వాస్కోడిగా
               మా వెంట నరుదెంచె మందుగుండు
     పరగించి యగ్ని పర్వతముపొంగిన యట్లు
               పొంగించి బహుదుర్గములను గూల్చె
               
గీ॥ వైరి దుర్భేద మైన చిత్తూరికోట
    దక్షిణపు గోడ డుల్లి రంధ్రంబు వడియె
    నూర్ణీత జగన్నుత పతాక్ర మార్జునుం డ
    రాతులను దానికి యర్జునరావు మడిసె.136
     
గీ॥ ఐదువందలు హర వంశ్యులతనితోడఁ
    బడిరి మధ్యాహ్న మార్తాండు పగిది మండి
    యరులఁ దాఁడి దుర్గారాయఁ డస్తమించె
    నఖిల చోండావదన్వయు లనుసరింప. 137
    
గీ॥ ఆవల దేవరభటులు ఝాలాన్వయులును
    జీవము లొసంగి రంత భాగ్జీయు వచ్చి