పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞప్తి.

" శ్రీ రాణా ప్రతాపసింహ” కావ్యకర్తలు శ్రీ దుర్భాక రాజశేఖర శతావధానిగారు 30-4-1957 పరమపదించిరి. వారి లేఖనినుండి యింక నేన్నో కావ్య గుచ్చములచే పరిమళింపవలసిన భాగ్యము ఆంధ్రసారస్వత వనికి లేకపోవుట కెంతయు చింతించు చున్నాము.

ఆంధ్ర జనత నుండి “రాణా ప్రతాప” కావ్యము కావలెనను ఉత్తరము లెన్నియో వచ్చినవి. అట్టి కావ్యము ప్రజల కందుబాటులో లేకుండుట సంభావ్యము కాదని, వారి అల్లుడు కుమార్తెయు నగు శ్రీ M. అనంతరామ్ M.B.B.S, శ్రీమతి కామేశ్వరీ దేవిగారు ఈ కావ్యమును పునర్ముద్రణము చేయింప దలచి, ఆ కార్యభారమును నా కప్పగించిరి నేనును శ్రీ శతావధానిగారియందును, కావ్యము నందును నాకుగల గౌరవముచే సంతోషముతో అంగీకరించితిని. ఈ కావ్యము ని ట్లు ముద్రింపించి యిప్పుడు వెలువఱచు చున్నాము.

ఈ కూర్పున మేము చేసిన మార్పు లేవియు లేవు. తృతీయ ముద్రణ ప్రతి ఆధారముగా కావ్యము ముద్రింప బడినది. పీఠిక ప్రధమ ముద్రణము లోనిది గైకొన బడినది.


ప్రొద్దుటూరు,

సి. వి. సుబ్బన్న శతావధాని.

1-8-58.