శ్రీ దేవీ భాగవతము
134
వ. అని కృతనిశ్చయుండై తనతోడి సర్పశ్రేష్టుల మునులంజేసి వారలచేఁ గొన్ని ఫలంబు
లిచ్చి తా నొక కీటంబై యందొక ఫలంబునం బ్రవేశించి.311
క. అది సప్తమదీనమగుట | న్మదిఁ దలపోయుచును దంభమౌనులు ఫలముల్
వదలక చేతులయందిడి కదలిరి రాజగృహమునకు గడునిశ్చలులై.312
క. చని రాజగృహద్వారము | గని యచ్చట నెడములేక గాచెడివారిన్
మునులము మేము నృపాలకుఁ గనవచ్చితి మెపుడులేని కట్టడి చనునే.313
శా. మామంత్రంబులచేత రాజు బ్రతికింపెన్ పచ్చియున్నార మెం
దే మాయోగము వీటిబొవదు విప ద్భీతిం దొలంగించి భూ
స్వామి న్సంతసపెట్టి యేగెద మనిర్వార్యంబుగా మేడపై
నేముం బోవగ నిఛ్చెయించెదము పోనిం డింక నా వారలున్.314
వ. ఈనాడు రాజసందర్శనంబు మీకుం బొసంగ వెల్లిరండు విప్రశాపభయంబున ఱేఁడు మీద
మేడనున్నవాఁడు మేము పోయి నరవరునకు మీరాక విన్నవించెదమని వారట్ల చేసిన జన
పాలుండు ద్వారాపాలుర కిట్లనియె.315
క. ఈరలు దెచ్చిన ఫలములు నీరును | దుంపలును మాకు నిండుముదమునన్
వీరలచే బంపు డిపుడు తీరదు రే పిచటి కరుగుదేరుడు మీరల్.316
క. అనిచెప్పి పనుప వారలు చని తెలిపిన వార లట్ల సలిపిరి యంతన్
మనుజేంద్రుఁడు ఫలముల గొని మనమున నంశయయులేక మంత్రుల కనియెన్.317
క. మునులిచ్చిన యీ ఫలముల దినుడీ మీరెల్ల నేను దినియెద నిది యం
చును బెద్దపండు నొకదానిని గొని యిది మంచిదనుచు నృపమణి కోయన్.318
క. పుఱుగొకటి ఫలములోపల నిఱికినఁ నాఁ గాంచి కంటిరే చిన్నది యీ
పుఱుగు నలుపైన కన్నులు | నెఱుపు నెరవు నొడలు నిఱికె నీఫలమందున్.319
వ. అని వెండియు నామహీపాలుండు నాడు సూర్యుం డస్తమించె నింకఁ దనకు శాప
భయంబు తొలఁగెనకా యెంచి యిట్లనియె.320
క. మునికులవర్యుని శాపం | బునకుం గొబరాకయుండ మునుకొని కీటం
బును మెడ నుంచెద ననుచున్ జననాధుడు పురువు మెడను జయ్యన దాల్చెన్. 321
ఆ.వె. తక్షణంబ పుఱువు తక్షకుండై కాల రూపుఁ డగుచు భీతిదోప నడరి
నృపతియొడలుసుట్టి కృపలేక కోఱల నంటబట్టి కఱచె మంటలెక్క.322
తే.గీ. మంత్రివరు లప్డు విస్మయోన్మాదగరిమఁ | గడఁగి యేడ్చుచుఁ బాఱిరి కడలకొదిగి
రక్షకులు దుఃఖవివశులై యక్షులందు బాష్పములు జార హాహారవంబు లిడిరి.323