పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ య స్కం ధ ము.

133


తే.గీ. అనిన బ్రాహ్మణుఁ డట్లకాకనుచుఁ బలుక, దక్షకుఁడుబోయి న్యగ్రోధతరువుగఱవ
    భగ్గుమనిమండి యప్పుడే భస్మమాయె నది కనుంగొని బ్రాహ్మణుఁ డట్టె లేచి.299

ఉ. దిగ్గనఁ బోయి చేరువను డిగ్గియు నీళులు గొంచువచ్చి చెం
    బొగ్గి జలంబులం బురిసె డొప్పుగ బోయుటఁ బట్టి మంత్రమున్
    బిగ్గరగాక లోగొణిగి నేర్పున భూయని యూదియూది తా
    డగ్గఱబూదిఁ జిల్కిన వటత్వము బొందె నిదెప్పటట్లుగన్. 300

క. అది గని యచ్చెరువడి యా ముదిబాపండైన పాము మోసమువచ్చెం
    గద యంచుఁ గశ్యపుం గని సదయాంతకరణ నీదు శక్తిన్ గంటిన్.301

తే.గీ. ఎందుకీశ్రమ పాటుల చందమామ కోరితేనియు లక్షలకొలఁది ని త్తు
    నీకుఁ గలవాంఛ సెలవిమ్ము నిక్కమపుడు నా విని ధరాసురుండు మనమ్మునందు.302

తే.గీ. ధనముగైకొని వచ్చినదారినేగ లోభమున కీర్తిచెడిపోదె లోకమందు
    నృపతి బ్రతికించి యౌనెంత నిపుణుడనెడి యశమునుం బుణ్యమును గాంచి యరుగజనదె.303
 
తే.గీ. అల హరిశ్చంద్ర కర్ణాదు లైనవారు | కీర్తికొరకెంతలేని సత్క్రియలొనర్చి
    రవని నేలెడివాడు విషాగ్నిమ్రగ్గఁ జూడు చేగుట ధర్మంబె సుజనునకును. 304

తే.గీ. రాజునే బ్రతికించిన రాణిబ్రతుకుఁ | బ్రజలు జీవించు రింతయు భయములేక
    రాజు పోయినయేని యరాజకంబు వచ్చు నాకును పాపంబు వచ్చుఁగాదె.305

వ. అని బహువిధంబుల వితర్కించి యెట్టులేనియు మునిశావంబు తప్పనట్టులున్న యది
   యని నిశ్చయించి తాఁ గోరినట్లు ధనంబు తక్షకునివలన సంగ్రహించి కశ్యపుండు
   గృహంబునకు బోయె నంత.306

ఆ.వె. కట్టుదోతు జన్నిగట్టును బంపితి గుట్టు సెడకయుండఁ గట్టివేసి
   యెట్టులైన రాజు పట్టణంబున కేగి పట్టి కఱతుఁ దపసి తిట్టుకలిమి.307

వ. అని నిశ్చయించి తక్షకుండు.308

శా. ఏడంతస్తుల మేడ పైఁ బటుతరాహీనోగ్రమంత్ర, క్రియల్
    తోడౌ బ్రాహ్మణకోటికాపనుచు సందుల్ గొందులం దెల్లవా
    రాడం దా వి ని తక్షకుం డిప్పుడు పోరాదందు నిందుండి వె
    న్కాడం గూడ దికేమిసేయుదునటం చాత్మన్ వితర్కింపుచున్.309

క. బాపనిశాపము భూపతి | రూపడపకయుండఁజనదు రూఢిగ నాకుం
   బాపములే దొక మోసపు ॥ రూపునఁ జని కఱతు నీతిద్రోచుట చనునే.310