పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

59


క. హరిహర విధి రవి శిఖి యమ | వరుణ కుబేరాదులైన వాసవుఁడైనన్
   గురుఁడైనం బరుఁడైనన్ | నిరుపమశక్తి ప్రయుక్తి నెరసిరి ఘనులై. 263

క. తగుశక్తి రెండు విధముల | సగుణయు నిర్గుణయు ననఁగ సగుణాభిధ రా
   గిగణము గొల్చును నిర్గుణ , నగణిత వైరాగ్యమార్గు లర్చింతు రొగిన్. 264

ఆ.వె. మును లెరుంగ లేరు మూలశక్తి నికెట్లు | మూఢజనులు నిత్యమూర్తి నెఱుఁగ
   నేర్తు రదియుఁ గాక నిజ మిక్కలిం గల వార లల్పబుద్దు లైరి కారె.265

క. శక్తిమయము జగ మంతము | శక్తి జగన్మయము వేఱ సందియు మేలా
   శక్తిమయము గానిది ని శ్శక్తిక మణుమాత్రమైన జగమున గలదే. 266

క. కావున నెవ్వం డేనియు | సేవింపం దగును శక్తి సమధికలీలా
   వ్యావృత్తి విశ్వమంతయు | దేవియ పాలించు భగవతీనామమునన్. 267

క. అని వ్యాసునివలనను నే | వినియుంటిని వ్యాసుడిద్ది నారదు చే
   త నతఁడు పితామహునిచే | వినియెన్ ద్రుహిణుండు వినియె విష్ణునిచేతన్. 268

6. నరు లెవ్వ రిందునకు వే | ఱరయంగారాదుసుండి యనుభవవేద్యం
   బరుదార శక్తికంటెను బరు లాద్యులు సేవ్యు లెన్నఁ బడరు బుధులచేన్. 269

వ. అని మఱియు.270

చ. కరు మరుదార శ్రీవిభునికాయము లోపలి యోగనిద్ర వేఁ
    బెరసి మరుత్పథస్థ యయి పేర్మి నటుండగ వాసుదేవుఁడ
    చ్చెరువుగ మాటిమాటికిఁ జేతులు సాచుచు నావులింపుచున్
    వెరపు మెయిన్ బురస్థ్సుఁడయి వేఁడు ప్రజాపతిఁ గాంచి యిట్లనున్.271

చ. తతతపముం ద్యజించితిఁ గతం బది యే మిటు రాకకుం భయ
    స్థితి నిటు లున్కిఁ గారణముఁ దెల్పుము నాఁ బరమేష్ఠి యార్తివి
    స్తృతుఁడయి పల్కెనో సుజనసేవ్య భవచ్ఛ్రప కల్మషోత్థులై
    దితిజులు మీఱి రుద్దతులు దీప్తభుజు ల్మధుకైటభాభిధుల్. 272

-:మ ధు కై ట భ యు ద్ధ ము:-



క. వారిరువురు ననుఁ దమితోఁ | బోరునకును ర మ్మటంచు బోరనఁ బైకిన్
   జేరుచుఁ జంపెద మనుచున్ , ఘోరాకారములఁ జుట్టుకొనిరి మురారీ. 273
క. అక్షీణకృపామయుఁడపు | రక్షించుము నన్నుఁ బ్రీతి బ్రతుకు గలిగినన్
   భక్షింతు బలుసాకున్ | రక్షోభయ ముడిగి ద్రుమపరంపరనేనిన్.274