పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


నతిశయదివ్యపద్మాసనాసీనుండు
        బ్రథితతాపసజనపరివృతుండు
నిర్మలసత్కర్మనిష్ఠాగరిష్ఠుండు
        పరమామృతధ్యానపరవశుండు


తే.

నగుచు నామ్నాయగోప్యశాస్త్రాదులందు
వింతవింతగ మూర్తీభవించి మెలఁగఁ
జేరి సావిత్రి గాయత్రి భారతియును
గొలువఁగాఁ గొల్వునం దున్న జలజభవుఁడు.

21


ఆ.

దేవతలను మునులఁ దిలకించి వేడ్కమైఁ
జెంత రం డటంచుఁ జేర్చి వారి
కార్యములను దెలియఁగా నడ్గ వారెల్ల
నుడివి రిట్లు మ్రొక్కి నుతు లొనర్చి.

22


వ.

పితామహుఁడా! రావణాసురునివలన మేము పడు బాధ
లెంతని చెప్పఁగలము. తద్రావణుండు నశింపక యుండిన సాధు
జనబృందంబులకు బాధలు మాన వదియునుం గాక.

23


సీ.

వరసుధాంబుధియందు వైకుంఠపురియందుఁ
        ద్రిభువనంబుల మేము దిరిగి వెదకి
వచ్చితి మం దెందు వాసుదేవుఁడు లేడు
        కావున మేము మీకడకు వచ్చి
శరణు వేఁడితిమి శ్రీహరియుండు తా వెందుఁ
        గలదొ యెఱింగింపవలయు మీరు
చక్రి సంచారంబు సర్వం బెఱింగిన
        వారు గావున వేఁడువారు మేము