పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

77


బులను వెదకి వేసటనొందితి మింత కా హరి యుండునెడ నెఱుంగక యీమార్గంబున.

16


క.

చనుదెంచితి మాదేవుం
డనుపమవైకుంఠపురమునం దుండును గా
వున రావణవృత్తాంతము
వినిపించెద మచట హరికి విస్మయపడఁగన్.

17


చ.

అన విని నారదుం డనియె నయ్య వికుంఠమునందు విష్ణుదే
వుని గని రాను నేను బహుళోత్కలికం జను నొక్క పార్షదుం
డనియె వికుంఠము న్విడచి యాహరి భూతలమందు లక్ష్మితో
నొనరఁగ నొక్క కొండపయి నుండును పొమ్మనె వింటి నంతయున్.

18


క.

కావున నచటికి మీరిఁకఁ
బోవలసిన దేల చక్రిపుత్రునికడకుం
బోవుద మా జలజాసనుఁ
డే వివరము దెల్పు ననుచు నెదురుగ గనుచున్.

19


ఆ.

దేవమౌని వల్కె దేవేంద్రసురముని
ముఖులు సత్యలోకమునకుఁ బోయి
ఘనచతుర్ముఖములు కరచతుష్టయములు
గలిగి యొప్పుచున్న కమలభవుని.

20


సీ.

కాంచి రచ్చటఁ దప్తకనకాభదేహుండు
        లోకవందితుఁ డష్టలోచనుండు
మహనీయదండకమండలహస్తుడు
        బాలభానుప్రభాభాసితుండు