పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

406

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సీ.

పట్టి విజ్ఞాన సద్భక్తివై రాగ్యము
        ల్గలవాఁడ వగుచు దుష్కామములను
నిడిచి నిర్మలుఁడవై విజనస్థలము చేరి
        నన్ను ధ్యానించు నిర్ణయము మెఱసి
సారూప్యపదని నిశ్చయముగ నిచ్చెద
        నని యతనికిఁ జెప్సి పంపెఁ జక్రి
నిజనివాసము చేరి నెఱిఁ దప్పకయ తొండ
        వానుండు సుతునకు శ్రీనివాసుఁ


తే.

జేరి వేడ్కను రాజ్యాభిషిక్తుఁ జేసి
వేంకటేశుని చరణారవిందములను
గ్రమముగాఁ గొల్చి నిత్యోత్సవములు సేయు
మనుచు సుతునకు నియమించె ననఘుఁ డచట.

342


ఆ.

తొండవానుఁ డంతఁ దుర్యభక్తిజ్ఞాన
యుక్తుఁ డై మహావిరక్తుఁ డగుచు
వేంకటాద్రిఁ జేరి విజనస్థలమునండు
నిలిచి ధ్యానయోగనిష్ఠ నొందె.

343


ఉ.

అంతటఁ గొంతకాలమున కంబుజలోచనుఁ డానృపాలకున్
స్వాంతమునందు మెచ్చుచును సత్కృపతో నట కేగి నవ్వుచున్
వింతగఁ జెంత నిల్చె నటవి న్వసియించిన భూవిభుండు శ్రీ
కాంతుని జూచి లేచి కరకంజములన్ ముకుళించి నమ్రుఁడై.

344


ఉ.

సద్గుణ మొప్పగా మది నచంచలభ క్తిరసంబు నిండఁగా
గద్గదకంఠుఁడై నృపుఁడు కన్నులు బాష్పములొల్క మ్రొక్కుచున్
మద్గురుచంద్ర న న్నిచట మానసమందుఁ దలంచి వచ్చితే
చిద్గగనాత్మ నీమహిమ శేషుఁడు సన్నుతి సేయ నేర్చునే.

345