పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

405


తే.

గరుడవాహన మెక్కి వేంకటవిభుండు
భీముఁ డున్నట్టిచోటుకుఁ బ్రేమఁ బోయి
పరమపావనచరితుఁడా భక్తవరుఁడ
రమ్ము సాయుజ్య మిచ్చెద నెమ్మి నేఁడు.

338


క.

సరసిజనాభుఁడు వల్కఁగ
సరగున భీముండు మ్రొక్కి సతితో సపుడే
హరి సాయుజ్యపదంబున
కరుగఁగఁ గని తొండవానుఁ డారటపడుచున్.

339


సీ.

హరి కిట్టు లనియె నోయబ్జాక్ష నీభక్తుఁ
        డగుభీముఁ జూచి నే నాప్తముగను
భాషించుచుండఁగఁ బరమపదము వాని
        కిచ్చి పంపించితి వింతలోన
నాకు సాయుజ్య మెన్నటి కీయఁదలఁచియు
        న్నా వన విష్ణుండు నగుచుఁ బల్కె
నితనిసాత్వికభక్తి కిష్టంబు నొందితి
        సాయుజ్య మిచ్చితి సజ్జనుండు


తే.

పూర్వమే మోక్ష మడుగ నీపూజ పరుల
కెఱుకయై చక్రవర్తి నీయింటి కెపుడు
వచ్చు నప్పుడు నీకు నీవనిత కేను
మోక్ష మిచ్చెద నని యంటి నీక్షణమున.

340


క.

వానికి మోక్షం బిచ్చితి
దీనికి జింతింప నేల ధీరుఁడ వగుచున్
నీనందనునకుఁ బట్టము
మానితముగఁ గట్టియుంచు మానవనాథా.

341