పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

400

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


బుణ్యమార్గంబునం బోయి బ్రహ్మాదు లు
        న్నట్టి లోకంబుల నన్ని చూచి
వచ్చితి ననియె నవ్వలఁ గుమారుం డిటు
        లనియె నోతండ్రి నే నద్భుతముగ
బోయి సప్తద్వీపములను దోయధులను
        గైలాసగిరిని శంకరుని జూచి


తే.

వచ్చి తని చెప్పు బుత్త్రిక వచ్చి యిట్టు
లనియె నోతండ్రి పర్వతవనములను ని
బుధుల రాక్షసగణములఁ బుణ్యమునులఁ
జూచి వచ్చితి వేడ్కమై దాఁచ నేల.

322


క.

అని యామువ్వురు తమతమ
యనుభవములఁ జెప్పి రప్పు డావాక్యములన్
విని వెఱఁగున విప్రుం డి
ట్లనియెన్ మీపుణ్య మతిశయం బై యొప్పున్.

323


ఆ.

అనుచు వారితోడ నరుగ నుద్యుక్తుఁడై
యుండురీతిఁ దెలిసి తొండవానుఁ
డపుడు భూషణంబు లంబరంబులు వారి
కిచ్చె ద్విజుఁడు నృపుని మెచ్చి లేచి.

324


తే.

రాజు నాశీర్వదించి భూరమణ మేము
పోయివచ్చెద మని పల్కి పొగడి సతిని
బాలకులఁ దోడుకొని వోయి పరఁగ మదిని
సంతసించుచు నిజనివాసంబుఁ జేరి.

325


క.

తోషించి సతిని బిడ్డలఁ
బోషించుచుఁ దాను ముక్తి బొందెడుకొఱకై