పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

401


శేషాచలపతి మహిమ వి
శేషముగాఁ బ్రజల కెఱుఁగఁ జెప్పుచు నుండెన్.

326


సీ.

అన విని మును లెల్ల నాశ్చర్యమును బొంది
        యిట్లని పలికి రిదేమి వింత
యీకళేబరముల నెఱి నేలఁ బడవైచి
        పోయి లోకాంతరంబులఁ జరించి
క్రమ్మఱ వచ్చి తద్ఘటములలోఁ జొచ్చి
        యాకూర్మునకు వార లచటఁ గనిన
వింతలు చెప్పిన విధము తేటగఁ జెప్పు
        మన విని సూతుఁ డిట్లనియె వారు


తే.

స్థూలములను విసర్జించి సూక్ష్మతనువు
లందు వెల్గుచు నుండి లోకాంతరముల
స్వప్నములఁ గన్న వింతలచందముగను
గూర్మునకు వారు చెప్పి రాగుఱుతు లెఱిఁగి.

327


ఆ.

బ్రహ్మముందు జీవపఙ్క్తులు కర్మసం
స్కారలింగదేహకలితు లగుచు
నంబరమునఁ దిరుగునట్టి పక్షులరీతి
సకలలోకములను సంచరించి.

328


వ.

అవ్వలం దమఋణానుబంధంబుగఁ గర్మసంస్కారంబులతోడం
గూడి యరుణరూపులై గగనాంతర్గతవాయుపథంబునం బడి
సూర్యకిరణోదితమేఘబృందంబులం బొంది వృష్టిమార్గం
బున సకలౌషధీజాలంబులం జొచ్చి యన్నరూపంబు నొంది
పురుషవీర్యరూపంపై శ్రీగర్భంబులయందుఁ బ్రవేశించి స్థూల
దేహంబుల ధరించి నవమాసంబు లందుండి వెడలి బాల్య