పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

377


జెప్పవలసిన మాటలు జెప్పినాఁడ
నంచుఁ గన్నీరు నింప నిట్లనియె లక్ష్మి.

239


మ.

ధరణీదేవి ముదంబుతో జనక యీతాపంబు నీ కేల నేఁ
బరఁగ న్నన్నును నీసుతం గరుణమై భావించి రక్షించు శ్రీ
హరియం దున్నది చింత సేయ కిఁక నీ వానందచిత్తంబునన్
గరుణం జూడుము మమ్ముఁ బెద్దవు సుఖఖ్యాతిం దగం బొందుమా.

240


వ.

అనుచుండఁ బద్మావతిం జూచి ధరణీదేవి యిట్లనియె.

241


తే.

వినవె నాముద్దుపట్టి వివేకముగను
హరికి సిరికిని శ్రీవేంకటాద్రియందుఁ
గీర్తి నొందుము భక్తిసంపూర్తి సేవఁ
జేయుచును దల్లి! సిరితోడఁ జేరి పొమ్ము.

242


క.

అప్పద్మావతి తల్లిని
తప్పక కని కనుల బాష్పధారలు వెడలన్
ఱెప్పల నడ్డము సేయుచు
నప్పుడు సిరితోడ విభుని కభిముఖి యయ్యెన్.

243


వ.

అంత శ్రీనివాసుండు లక్ష్మిని బద్మావతిని దోడ్కొని గరుడ
వాహనము నెక్కి బ్రహ్మాదులతోడ నగస్త్యాశ్రమంబునకుం
బోయి బ్రహ్మరుద్రాదులకుం దమ కాదినంబందు నగస్త్యులు
తన తపోబలంబున నానందంబుగ విందులు చేయించె.
నమ్మఱునాఁడు బ్రహ్మాదులుతోడ వేంకటాద్రి కేగి యచ్చట
నెల్లరకుం గ్రమ్మర విందు లొనరించి గౌరవింప వా రెల్లరు
మాధవు నాజ్ఞానుక్రమంబునం దమనివాసంబుల కేగిరి సిరి