పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


కొల్లాపురంబునకుం బ్రయాణం బై హరిం జూచి సవినయం
బుగ నిట్లనియె.

244


తే.

దేవ కరవీరపురి కరుదేరవలయుఁ
గరుణతో సెలవిమ్ము మోకంజనయన
విని శిరము వంచి విన్ననై వెన్నుఁ డపుడు
కమలనేత్రను జూచి తాఁ గరము పట్టి.

245


వ.

ఇట్లు వక్కాణించె.

243


సీ.

ఇందిర నన్ను నీ వెడఁబాసి పోను గా
        ళ్ళాడునే నిన్నుఁ బొమ్మంచు నాకు
నోరాడునే? నీవు నూతనబంధుల
        వలె సెల విమ్మంచుఁ బలుకఁదగునె?
పద్మావతిని నీవె పాలింపవలయు నీ
        కన్యను బోషింపగలనె తగునె?
యకట నీ విందుండ కరిగినకతముచే
        ధనదుఁ డిచ్చిన యప్పు దప్పకుండ


ఆ.

నేను దీర్పఁగలనె? యియ్యెడ నాకూడ
నుండు మన్నిటకు నఖండసౌఖ్య
దాయిని వయి నన్ను ధన్యుని జేయుము
నాకు దిక్కుగలదె నీకుఁ దప్ప.

247


వ.

అనిన విని యిందిర మందహాససుందరవదనారవింద యగుచు
నరవిందదళాక్షున కిట్లనియె.

248


మ.

సకలజ్ఞత్వము డాఁచి దివ్యమహిమల్ చాలించి పద్మావతిం
బ్రకటాసక్తిని బెండ్లియాడితివి సౌభాగ్యంబు నీ కిచ్చి నే