పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

337


విను మాజలధికన్యఁ గని మ్రొక్కి శ్రీహరి
        వేంకటాచలముపై వేడ్క మీఱఁ
గడు నశక్తుండయి కనులఁ జూడఁగ నిన్ను
        వాంఛించుచున్నాఁడు వార్ధిపుత్రి


తే.

మోము చూపు మటంచును బ్రేమఁ జెప్పి
తోడుకొని రమ్మటంచును నేఁడు నాకుఁ
జెప్పి పంపంగ వచ్చితిఁ జెప్పినాఁడ
ననుచుఁ జెప్పుము పోపొమ్ము మరసి లక్ష్మి.

113


వ.

వచ్చును సందియం బుండదనిన విని దివాకరుం డట్లరిగి.

114


తే.

శ్రీసతికి మ్రొక్కి పల్కె నోసింధుతనయ
చక్రి యిప్పు డశక్తుఁడై జాలిపడుచు
శేషగిరియందు నున్నాఁడు శీఘ్రముగను
నేఁడు నినుఁ జూడ నున్నాఁడు నిజము తల్లి.

115


క.

అని యాసూర్యుఁడు వల్కఁగ
విని భీతిని బొంది లక్ష్మి వేగరథముపైఁ
దనరార నెక్కి నభపథ
మునఁ జని శేషాద్రి డిగియెఁ బుర్షుని జూడన్.

116


క.

అప్పుడు బ్రహ్మేంద్రాదులు
తప్పక సిరిరాక యెఱిఁగి తమవాద్యతతుల్
తెప్పున మొఱయించుచుఁ జని
రప్పరమపవిత్ర లక్ష్మి కానందముగన్.

117


సీ.

శ్రీలక్ష్మి నీక్షించి చెలఁగి దండము లిడి
        తోడ్కొని వచ్చిరి తొడరి యపుడు