పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

197


శ్లోకుని సూతునిం బ్రియముఁ జూచుచు వేంకటశైల మిద్ధరన్
జోకుగ నేయుగంబునను శోభితమై పొగడొందుఁ జెప్పవే.

9


వ.

అనిన విని సూతుండు చూచి మీరు నన్నడిగినట్లు జనకుండు
శతానందుని నడిగిన నతఁ డతనికిఁ జెప్పిన పూర్వేతిహాసంబు
చెప్పెద వినుండని సంతసంబున నిట్లనియె.

10


సీ.

వినరయ్య మునులార వేడ్కమైఁ గ్రమముగ
        ధర్మకాలంబు త్రేతాయుగమున
జనకుండు నిర్మలస్వాంతుఁ డై శాంతుఁ డై
        యెస మిథిలాపురి నేలుచుండి
తనతమ్ముఁ డగుకుశధ్వజుఁ డనువాని కూఁ
        తులను దాఁగన్నకూఁతుకును దగిన
పతులను దనలోన భావించి వెదకుచు
        దొరుకునె తగినబంధుత్వ మనుచు


తే.

నలువురగుకన్యలకు నరనాథుసుతులు
నలుగు రొకయింటఁ బుట్టియున్నను బ్రియంబు
వారీ కీబాలికల నీయవచ్చు నంచుఁ
జిత్తమున నెంచుచుండఁగఁ జెలఁగి యపుడు.

11

భవిష్యోత్తరపురాణము

క.

చనుదెంచె శతానందుం
డనుకులగురువర్యుఁ డెలమి నాజనకుఁడు గ
న్గొని లేచి యెదురుసని పద
వనజంబుల కెఱగి దెచ్చి వరభక్తి దగన్.

12


వ.

భర్మాసనంబునఁ గూర్చుండఁజేయ నయ్యాచార్యవర్యుం డి
ట్లనియె.

13