పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

మానవాధీశ! సీతకు మాండవికిని
యూర్మిళకు శ్రుతకీర్తికి నొగి వివాహ
యత్నమును జేయు మింక నీ వప్రయత్న
ముగను నుండుటగాదు నెమ్మిగను ధాత్రి.

14


వ.

తగినపతుల నన్వేషింపు మూరకుండకు మనిన.

15


సీ.

విని మిథిలాపురివిభుఁ డగుజనకుండు
        గని శతానందుని వినయ మెసఁగ
ననియె నోగురువర్య! మును సవనానికి
        భూమిదున్నంగ నద్భుతముగాను
ధరణి జనించెఁ గదా సీత లోకైక
        మాత యటంచు నామదికిఁ దోఁచి
యున్నది యిపు డట్టి యుర్వీతనూజను
        నరున కీఁదగునె యెన్నాళ్లకైన


తే.

సీతచిహ్నము లన్ని లక్షించి చూడ
శ్రీరమాదేవియంశజ సిద్ధ మిట్టి
సతికి హర్యంశగలవాఁడె పతిగ నమరు
గాన సిద్ధర నెందేని బూని చూడ.

16


వ.

అట్టి మహనీయుండును, పురుషోత్తముండును, గలఁడేని వచిం
పుము మఱియును.

17


క.

హరి పూర్ణాంశుండై ధర
నరపతి జనియించియున్న నామందిరమున్
బరఁగుచునుండెడు శ్రీశం
కరచాపముఁ ద్రుంచు ముజ్జగంబులు వొగడన్.

18