పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

143


మానదు. మానిన నర్థకామ్యాదిరాగద్వేషాదులు వీడవు.
వీడినను బారతంత్య్ర ప్రకారంబు గలుగనేరదు. కలిగినను
శ్రీవైష్ణవత్వంబు చేకూఱదు.చేకూరినను సాత్వికపరి
గ్రహుండు కాఁడు. అయినను భాగవతపరిగ్రహుండు కానే
రఁడు. అట్లయిన ననన్యార్హప్రయోజకుఁడు కాఁడు. అయిన
ననన్యార్హశేషభూతుండు గానేరఁడు. అయిన ననన్యార్హ
శరణుండు కాజాలఁడు. అయిన నధికారపుర్షుండు గాఁడు.
అయిన నష్టాక్షరి కధికారి యగును.

74


సే.

అట్టి సచ్ఛిష్యుల కాచార్యు లుపదేశ
        మిచ్చి రక్షించుట యెట్టు లనిన
శ్రీవైష్ణవాచారచిహ్నానుసరణంబు
        గా నుపదేశించి కరుణఁ బెంచి
యష్టాక్షరీమంత్ర మతిశయం బంతక
        న్నను మంత్ర మెందు లేదనుచుఁ జెప్పి
నారాయణుఁడె మహోన్నతుఁ డతనికి మించి
        నట్టి దేవుండు లేఁ డంచుఁ బలికి


తే.

పట్టుగా ద్వయచరమప్రవృత్తి భక్తి
నిష్ఠలను జెప్పి హరిని ధ్యానించువిధము
చెప్పి యొప్పుభరన్యాసచిత్సుఖంబు
నందుఁ బొందింతు రాచార్యు లైనవారు.

75


సీ.

చక్కఁగ నాచార్యసంశ్రయణం బైన
        వెనుక గామాదుల విడిచిపెట్టి
తలఁపున నెపు డహంతామమతలు లేక
        విజనస్థలములందు విమలు లగుచు