పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


మితభోజనంబును మితసుషుప్తియు మిత
        సంభాషణంబు లాచార్యభక్తి
యతిశాంతము పరిగ్రహంబు నారాయణ
        విగ్రహధ్యానవివేకగుణము


తే.

లభ్యసిపంగ మానసం బమల మగుచు
నిలుచు హరియంద మది యిట్లు నిలిచెనేని
యున్నతం బగువిష్ణుసాయుజ్యపదవి
నొందుదురు వైష్ణవశ్రేష్ఠు లుర్వియందు.

76


తే.

వేంకటేశుఁడ నగునాకు వేడ్కమీఱ
వివిధపరిచర్య లొనరించి విశ్వసించి
చెలగి యాచార్యశుశ్రూష చేయునట్టి
నిర్మలశ్రద్ధ వైష్ణవధర్మ మవని.

77


సీ.

వరగురువులఁ గన్న వస్త్రభూషణములు
        బ్రీతి రెట్టింప నర్చించువారు
ఆసక్తితోఁ దదీయారాధనంబులు
        నంచితంబుగ నడిపించువారు
దేశికశ్రీపాదతీర్థప్రసాదముల్
        భక్తి గ్రహించి మేల్బడయువారు
పట్టైన శేషత్వపారతంత్య్రంబు జీ
        వాత్మధర్మము లని యలరువారు


తే.

తగనితామసరాజసద్వయము నడఁచి
యొనర సాత్వికనిష్ఠలై యుండువారు
శాంతియును భూతదయయును సత్యవాక్య
ములను గలవారు వైష్ణవు ల్మొనసి చూడ.

78