పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

శ్రీరంగమాహాత్మ్యము

క. పొమ్మనుచు తనూజలకున్, సమ్మతపడఁ జెప్పి ననుపఁ జంద్రుఁడు ననురా
      గమ్మున రోహిణిపైఁ దమి, ముమ్మరమున నింటికేఁగి మున్నిటిరీతిన్.
క. రోహిణిపై ననురాగ, స్నేహంబులు విడిచి మారు చికురాకు లిడన్
      మోహత లిరువురకును ను, త్సాహంబులునుండఁ దక్కు సవతులు వెతలన్.
గీ. తండ్రికడకేఁగి తమరు వర్తనముఁ దెలుప, నొప్పు చెడినదియయ్యె నయ్యువిదలును
      మాకు మాటాడబోయిన మఱియుఁదగిలె, నేల మిముదూర మాపుణ్య మింతె.
మ. అన నత్యాగ్రహవృత్తి దక్షుఁడు సరోజారాతి రావించి యో
      రి నిశాచార బహుప్రకారముల నీవృత్తంబు భావించితిన్
      ఘనమైనట్టి వయోమద ప్రకృతిఁ గన్గానంగలే వింత నీ
      కనుజన్మంబటె కాలకూటము కళంకాక్రాంతుఁ డౌటభ్రమే.
గీ. నీవు దోషాకరుండవు నిశిచరుండ, వాతతాయివి విరహిణీ ఘాతకుఁడవు
      పాతకుండవు కర్మానుభవముచేత, ననుభవింపుము పాండుక్షయంబు నీవు.
క. పొమ్మనవుడు కలువలచెలి, యుమ్మలికన్ మారుపలుక నోడి యపుడు మై
      సొమ్మసిలి శ్రమము నలతయుఁ, గ్రమ్ముకొన న్మహికి డిగ్గి కావేరిదరిన్.
క. పుష్కరిణీ తీర్థములో, పుష్కరములు కంఠదఘ్నముగ రంగేశుం
      బుష్కరమతి భావింపుచుఁ, బుష్కరవిద్వేషి చేసె భూరితపంబున్.
శా. నూరేండ్లు నిరాశనుం డగుచు సర్వేశాంఘ్రిపద్మద్వయీ
      ధ్యానాచంచలభావుఁడై జగము లత్యంతంబు భీతిల్లి సం
      ధానిష్ఠన్ వసియించి యవ్వెనక తత్కాసారతీరంబునన్
      తా నత్యుగ్రతపం బొనర్చెను శతాబ్దంబుల్ నిరాహారుఁడై.
క. ఈకరణినున్న చంద్రుని, భీకరతమమునకు మెచ్చి బృందారకులున్
      లేకేశుఁడు నాకేశుఁడు, నాకాశశిరోరుహుండు నండలఁ గొలువన్.
సీ. పంపుగాఁ బఱచిన ఫణిరాజభోగంబు నవరత్నసింహాసనంబు గాఁగ
      నలరూపరావంబు నాజానుదీర్ఘంబు లగుతేతు లరిశంఖయుగముఁ దాల్ప
      యభినవోన్మేషజింహ్వంబైవైన తొలుచూపు జాయమానదయారసంబుఁ గురియ
      పవళించి లేచునిబ్బరమునఁ బెనగొన్న హారము సేనాని తీరుపరుప
      జారిన--లు మహీవైరి చక్కదిద్ద, దివ్యమంగళపాఠకోద్వృత్తి మెఱయ
      చంద్రపుష్కరిణీసరస్సరిదభూమిఁ, జంద్రునకు రంగశాయి సాక్షాత్కరించె.
క. గడగడ వడుకుచు నభవుని, ముడిబువ్వు భయంబు వెలయ ముదమును మదిలో
      వెడవెడ దిందియుడు గని, బుడిబుడి మ్రొక్కు లిడి హస్తములు మొగిచి వెసన్.