ద్వితీయాశ్వాసము
27
క. సాయంసమయమునకు నీ, సేయుసపర్యలు వరింపఁ జేరుదు నీతో
నీయడ లేమిటికని ఫణి, నాయకశయనమున వచ్చి నరవరమౌళిన్.
క. నిలిచితిని కంటకంటం, గలిగెం శ్రీరంగనాయకనిధానము నా
తలఁపులు ఫలించి గెలిచితి, నలువన్ మనఁగంటి ననుచు వర్తించె వడిన్.
మ. తలపై నన్ను ధరించి భూవరుఁ డయోధ్యాప్రాగ్దిశాప్రాంగణ
స్థలియందున్ సరయూతటంబున బ్రతిష్ఠానంబు శ్రీరంగమున్
వెలిసారం బనఁగా నయోధ్యభవనావిర్భావముం గోపురం
బులు ప్రాకారము లాయతించె సురశిల్పుల్ వచ్చి నిర్మింపఁగన్.
మ. మను విక్ష్వాకున కిచ్చె నన్వెనుక నమ్మార్తాండువంశంబునన్
జననంబొందిన రాజులెల్ల బహుపూజాసంతతారాధనల్
దినమాహోత్సవముల్ ఘటించి మది నెంతం దృప్తిగావించి రా
మునిపర్యంతము నర్చఁజేసిరి జనంబుల్ గాంచి రిష్టార్థముల్.
మ. ధరణీభారముమాన్ప దాశరథియై తాఁబుట్టి కైకేయి యా
భరతున్ బట్టముగట్ట వేఁడువరముం బాటించి సౌమిత్రియున్
ధరణీజాతయు వెంటరా భయదకాంతారంబుల న్మౌనులం
బరిపాలించి ఖరాదిదైత్యుల ననిన్ మర్దించి శౌర్యోన్నతుల్.
గీ. దండకాటవినుండ సీతను హరించె, పంక్తికంధరుఁ డది రామభద్రుఁ డెఱిఁగి
యర్కతనయహనూమాన్నరాదులైన, కపులచే వార్ధికట్టి లంకకును జనియె.
చ. దురమున నింద్రజిత్ప్రముఖదుష్టనిశాటుల లక్మణుండు దు
స్తరశరలాఘవక్రియల శౌర్యమునన్ దశకంఠ కుంభక
ర్ణరణకలాకలాపము తృణంబుగ నెంచి వధించి రాఘవుం
డిరవుగఁ దా విభీషణున కిచ్చిన పూనిక నిర్వహింపఁగన్.
గీ. జలధితీరంబునందు లక్ష్మణునిచేత, కట్టెపట్టంబు మునుపె లంకకు నిజముగ
వెనుక పట్టంబు గట్టించె వెలఁదితోడ, రామచంద్రుఁ డయోధ్యాపురంబు జేరి.
ఉ. తా నభిషిక్తుఁడై రఘువతంసము చాలబహూకరింపుచున్
భానుతనూజవాలిసుతపావనిముఖ్యులఁ బంచి రాక్షసేం
ద్రానుజుఁ డవ్విభీషణు ప్రియంబున రమ్మని పొమ్ము లంకకున్
మానకు మెప్పుడున్ మమత మాయెడనంచు వచించి పంపినన్.
మ. భయమున్ దత్తరపాటు దైన్యమును దోఁపన్ స్వామి శ్రీరామ మీ
దయకుం బాత్రుఁడగానె యేమిటికి నిర్దాక్షిణ్యచిత్తుండవై