పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

శ్రీరంగమాహాత్మ్యము

      పావనంబై రూపంబుతో రాగ దా
      దేవతారాఢ్యుఁ డీతీరుకన్ వ్రాటముల్.
తోటకం. రాదరిచూడక రారుగదా యీ
      చోదలకేమది చూచెద రాడే
      తాదనయిచ్చ వృధాతపమీడన్
      చోదల పోడలు బోలునె నాకున్.
చ. అని పెడదంబుగా మొదటియట్లన ఘోరతపంబొనర్చుచుం
      డిన మనుభూవరుం డిదిగణించి బలారిబలాబలాసురే
కుని శతకోటియట్లు పొగసూరునె రాజునకై యిదేల నా
      కనిమిషరాజ్య మింక నని యంబుజగర్భునిఁ జేరి యిట్లనున్.
క. అంభోజగర్భ యొక వి, శ్వంభరపతిమీఁద ననుప వసుధాస్థలికిన్
      జంభారి రిపుల దునిమిన, దంభోళికి యిపుడు యన్యధాత్వము వచ్చెన్.
క. నాకేటి కింద్రపట్టం, బాకడ నీమైలబాసినపు డయ్యెడు వే
      రేకట్టడ నేయింపుము, నాకము మీమనసునచ్చిన సుపర్వునికిన్.
గీ. అనిన నింతటిపనివచ్చెనా సురేంద్ర, చింతిలఁగనేల నేఁగల్గ నింతపనికి
      ననుచు నెందునకో తపమాచరింపు, చున్నవాఁడని భావించె యోగదృష్టి.
క. కాంచనజలము జారి వి, రించిబడియె వెజ్జు బొబ్బరించినరీతిన్
      ముంచిన మూర్ఛన్ గని యిది, మంచిపనాయెనని నముచిమధనుం డల్కన్.
క. బారదునేల కమండల, నీరముచేఁ గమలభవుని నేత్రాంచలముల్
      స్వారాజు దుడిచి మరలన్, సారసపీఠమున నునుప సభయుండగుచున్.
గీ. తపసునకు మెచ్చి నాయింట దలరడెపుడు, రంగపతి సర్వలోకశరణ్యుఁ డనుచు
      నమ్మితి నిదేటి పైన మైనావు తండ్రి, పాయనేర్తునె నే నిన్ను న్యాయముగను.
క. అని నే నతిరువారాదన, ముననప్పుడు పైనమగుచు మూలవిమానం
      బునుగూడి జతనమై యుం, డిన రంగస్వామివాకిటికి నడ్డముగన్.
క. పడిసన్నిధి బొరలుచు నీ, యడుగుందామరలు వాసి యరగడియైనం
      గడనుండి తాళనేర్తునె, జడనిధిపర్యంక యింత జనునే నీకున్.
మ. నను మేరి యెడబాసిపోవనని నానాదైన్యవాక్యంబులన్
      ననసాన్నిధ్యమునందు జింతిలు విధాతం జూచి రంగేశుఁ డి
      ట్లను ప్రాభాతికపూజ చేసితివి మధ్యాహ్నంబు భూమండలం
      బున నానాజనరక్షణెకభరమున్ బూనన్ విచారించితిన్.