పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

శ్రీరంగమాహాత్మ్యము

క. అనవుడు లేవే వీరికి, దనరిన నిష్కృతియటన్న ధరణీశ్వరుతో
      నినసూతి బలికె నిచ్చెద, నని తెగువరివైన వినుము నీహరిభక్తిన్.
మ. తొలిజన్మంబున నీవొనర్చితివి చేతోనిష్ఠమై ద్వాదశీ
      విలసత్పుణ్యమహావ్రతంబు త్రిజగద్విఖ్యాతమై నొక్కయే
      డలపుణ్యంబున నొక్కనాఁటి ఫల మియ్యంజాలుదే నందఱున్
      దొలఁగంజాలుదు రిమ్మహానిరయ పంక్తుల్ మాట మాత్రంబునన్.
గీ. కాకయుండిన వీరల కల్మషంబు, బ్రహ్మకల్పంబునందు దీరదు నృపాల
      యనవుఁడు కృపాళుఁడై యతఁ డట్టులైన, దొలుక నిచ్చితినన బ్రాణజాల మెల్ల.
మ. చులకనఁ జేయుచు నమ్మహానరకరాసుల్ మీఱి యక్కోలుగా
      కలగుండై గుమిగూడి చీమపరివీకం ద్రోపుత్రోపాడుచున్
      దొలఁగం ద్రోయఁగరాక పుష్పకములందున్ జెంతలన్ దేవతా
      కలవాణీకరచారుచామరము లంగశ్రాంతి వారింపఁగన్.
క. కుశలుని దీవింపుచుఁ దమ, కుశలంబులు పలికి యింద్రుకొలువున కరిగెన్
      దశదిశల వెలయఁ గీర్తులు, వశ మగు శమనుండు బనుప వసుధకు డిగియెన్.
క. తనరాజ్యంబునఁ గలిగియు, జను లెల్లను ద్వాదశప్రశస్తవ్రతవ
      ర్తనులై యిహపరసుఖములుఁ గని, మన నిలయేలె నతఁ డకల్మషమహిమన్.
క. ఈకథ యెవ్వరు వినినన్, శ్రీకరులై కోర్కులెల్లఁ జేకొని పిదపన్
      వైకుంఠపదవిఁ గాంతురు, నాకులమతి నెపుడు రంగనాయకు కరుణన్.
గీ. రాజకులచంద్ర యల భరద్వాజుతో స, నత్కుమారుఁడు వ్యాసులు నాగదంత
      మౌనివరుతోడ సూతుఁడు శౌనకాది, మునులతోఁ దెల్పెననుచు మృకండుసుతుఁడు.
క. పలికెన్ హేమకుతో న, వ్వలివృత్తాంతంబు యోగివరుఁడు భరద్వా
      జుల కిట్లనియె త్రయోద, శ్యలఘువ్రత మాచరింతు నత్తెఱఁ గెల్లన్.
చ. బలబల తెల్లవారునెడ బావనవారిని దీర్థమాడి తా
      చలువలు గట్టు తామ్రమున శక్తుఁడు గామికి మృణ్మయంబుగా
      కలశ మలంకరించి చిలుకంబడు నప్పటి వెన్నముద్ద మం
     డలములు గట్టు నాపయి నిడన్ వలయుం బరిపూర్ణకుంభమున్.
గీ. అందు శ్రీదేవితో శౌరి నావహించి, వెన్నపై నష్టదళపద్మ మున్న కలన
      ద్వారపాలకుల నమర్చి వేరువేరఁ, బూజసేయంగఁదగు విష్ణుపూజ చేసి.
క. కలశాంభఃపద్మం, బుల యెనిమిదియందు నుంపఁ జొప్పరును శ
     క్తులకును ఘననైవేద్యా, దుల నారాధింపఁ నగు వధూయుతముఁ గనున్.