పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

141


సరగద్రోణికలందు స్నానంబులొనరించి
            సలిలార్ద్ర వస్త్రసంకలితు లగుచు
భస్మత్రిపుండ్రాంక ఫాలంబు లనువొంద
            భసితంబు మేన నేర్పడఁగఁ బూసి
శిరమున కోటీశశిఖరి మారుగ శిలల్‌
            కీలించియును ముక్తకేశు లగుచు
దంపతుల్ గైదండ లింపుగా సవరించి
            మ్రొక్కులు దీరగా ముదము గదుర

నభవ కోటీశ కోటీశ హరహరా మ
హేశ యనుచును తనువులం దెరుకమాని
మానితానందసుధను నిమగ్నులగుచు
కొండదిరుగుదు రచ్చటనుండు జనులు 267

జంగమమూర్తులై శివుఁడు శైలముడిగ్గి తదుత్సవంబు బ్రే
మంగని సంతసించి గరిమంబునఁ బూజలొనర్చు భక్తకో
టింగను వేడ్క నెమ్మది ఘటింపఁగ నెంతయు వచ్చెనోయనన్‌
జంగమకోటి యచ్చటి కసంఖ్యముగాఁ జనుదెంచు నెంతయున్. 268

జంగమంబులు శివుఁడని చాటు శ్రుతులు
నమ్మి జంగమపూజ లున్నతి నొనర్చు
జంగమప్రాణియౌ భక్తజనము మనము
లీన మొనరించుఁ గోటీశు లింగమంద. 269

వీరమాహేశ్వరాచార సంపన్నులౌ
             యారాధ్యు లచ్చట నధికభక్తి
నొగిఁ ద్రికూటాద్రీంద్రు నురమున ధారణ
             లింగమౌ కోటీశు లింగమూర్తి