పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

109



కరగత రుద్రాక్ష కంకణంబులతోడ
        శివభక్తి లాంఛన స్థితులతోడ
నానంద హృష్టరోమాంచితాంగము తోడ
        మహిత యోగారూఢ మహిమతోడ
దనరి యా యింతి కోటీశు దర్శనంబు
సేయఁగా నేఁగు నచ్చటి సిద్ధసమితి
భక్తి యీ లీల మూర్తియై వచ్చెననఁగ
భూమి నానందవల్లి, కాంతామతల్లి109

ప్రత్యహం బట్టు లయ్యింతి పర్వతేంద్ర
మెక్కి యచ్చట కోటీశు నిష్టలింగ
మూర్తిఁగాఁజేసి పూజించుఁ బూని ప్రాణ
భావలింగంబులం దైక్య పదవినొంద.110

సేయు నుత్తరశైవ సంసిద్ధి లేక
యుండియును, దాను సద్భక్తియుండు కతన
షట్థ్సలాధ్వావధానంబు చంద్రవదన
చి త్తమున చంద్రధారణచేసి నియతి. 111

పూజించున్ శివుఁ బుష్పదామములచేఁ బూబోఁడి కోటీశ్వరున్
రాజచ్చంద్ర కళావతంస సమమై రంజిల్ల మౌళిస్థలిన్
తేజస్ఫూర్జిత ధూపదీపముల నెంతే నిచ్చు మాధుర్య వి
భ్రాజ ద్దివ్యఫలోపహార మొసఁగున్ భక్త్యన్వితస్వాంతయై. 112

అతివ ! మధుమధుర ఫలోపహార మొసఁగి
విసము మెసఁగిన చేదు నిం పెసఁగ మాన్చె
నిరతమృష్టాన్న నైవేద్య నియతివలన
నాది భిక్షుత్వ ముడిగించె నభవునకును.113