పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

108

కొంతసేపు సమాధిచే గుణము లణఁచి
మరలఁ దెలివొంది కోటీశు మానసమున
పూజ గావింపఁదలఁచి యా పురవిరోధి
సుగుణరూపంబుఁ జింతించి స్వాత్మయందు.78

శరదిందుకోటిసుందరమూర్తి గలవాని
      పటు జటామకుట విభ్రమమువాని
నీలకాంబరీ నీలకంఠమువాని
      భుజగేంద్రహార విస్ఫురణవాని
వరదాభయమృగాగ్నికరచతుష్కమువాని
      వ్యాఘ్రాజినాంబర ప్రభలవాని
వేదమంజీరాఢ్య పాదపద్మమువాని
      వేదాంతవేద్యుని వేదమయుని
ఆ పరాశక్తి సహితుని యా పరాత్ము
నా మహామహు కోటీశు నాత్మనిలిపి "
పూజగావించె నుపచారముల నొనర్చి
భక్తిశీలుండు సాలంక భక్త వరుఁడు.79

అంత గనువిచ్చి చూచిన యా క్షణంబ
యిష్టఫలదాయియైన కోటీశ్వరుండు
జంగమాకృతి దాల్చి విశాల బిల్వ
మూలవేదిక వసియించె ముదము గదుర.80.

అంత నిర్వర్తి తేశ్వరధానుండగు సాలంకుం డెదుటఁ గనఁబడు నాజంగమ
మూర్తి సాక్షాత్కోటీశ్వరుఁగాఁ దలంచి యభివాదనంబొనర్చి, తనయింటికిం
దోడితెచ్చి, నిత్యంబు జంగమార్చన వ్రతంబున కేర్పఱచుకొని యమ్మహా
పురుషున కర్పించిన పయశ్శేషంబాహారంబుగా నఖండ నిష్ణాపరుండై
యుండునంతఁ గొంతకాలంబున కతం డంతర్హితుండైన జింతాక్రాంతుండై