159
సీ॥ ఘనమౌని కులమాన్యకౌండిన్యగోత్రప
విత్రుఁ డాపస్తంబసూత్రమహిత
గతి హారి రేవూరి కాళహస్తి కవీంద్ర
పౌత్రు లింగకవీంద్రపుత్రుఁ గాళ
హస్తి మహాకవి యగ్రజన్ము నేకామ్ర
కవిశిఖామణి గుర్వ కవితిలక శి
వానందసుకవుల యగ్రజన్ముని ఘటి
కాశతగ్రంథసంఘటకు లేఖి
నీశితివరేణ్య కవితాప్రకాశకుని ది
నప్రబంధ నిబంధను నను ననంతు
తన రుచిరబోధయుత మనోవనరుహమున
తనరు నెనరున గనుగొని యనియె నిట్లు.
ఈతఁడు వృద్ధాచలమహాత్మ్యమును రచించి పంట లింగారెడ్డి కంకితము గావించెను- ఈతని పౌత్రుఁడు 'అనంతకవి' తన శ్రీముష్ణమహాత్మ్యమను గ్రంథములో నీ యనంతుని నిట్లు ప్రశంసించియున్నాఁడు-
సీ॥ ఐదేండ్లనాఁడె వేదాదివిద్యలు నేర్చి
విభుల మెప్పించె గర్వితుల నణఁచి
అట్టి ప్రాయమునాఁడె యష్టభాషల జతు
ర్విధకృతుల్ ధరవి నిర్మించి నిలిపె
ఘటికాదిశతదినైకప్రబంధముల మై
సూరి చెంజిండ్ల మెచ్చులు ఘటించె
నూఱుఘంటములకై నోరూరఁగ ఘనాఘ
నంబున కవిత మిన్నంది పలికె
నేకసంధావధృతధృతనేకవిబుధ
దుర్గ్రహగ్రంథసాహస్రతూర్ణతుష్ట
మండలాధీశదత్తసమ్మాన బాల
కవి యనంతేంద్రు నెన త్రిలోకములఁ గలరె?
ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక - 3 సం. పరిషత్పుస్తక భాండాగారము.)
ప్రథమావిభక్తి
శా॥ శ్రీనల్లందిగళన్వనాయ మవనిన్ - జెన్నొందు నేవంశమం
దానారాయణ జియ్యరం చనఁగఁ దా - నారాయణుం డుద్భవం
బైనాఁ డందు జెలంగు తిర్మలసుధీ - యాదోధిచంద్రుండు దా
నానూనస్థిరకీర్తిశేషఘనుఁ డు - ద్యద్ధర్మశర్మాఢ్యుఁడై.