పుట:శేషార్యోదాహరణము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

కొలువఁగా వారిలో గుణఖనియైన వేం
           కటరాఘవాచార్యు కదనశౌర్యు
మెల్లనె పాండ్యభూమిపతి చేపట్టె........
           ...........నతఁడు విలసిల్లు
అతని కూరిమి తమ్ముఁడైన కస్తూరయ్య
           పరిఢవిల్లె......కడుకీర్తి
గాంచెనా ఘనుని కగ్రజుఁడైన
           శేషార్యు డంచితశ్రీ వహించి
బాంధవతతికి కల్పకభూరుహంబయి
           కవులకు నిక్షేపకలనఁ దనరి
ఆశ్రితతతులకు నమరనగంబయి
           యంగనలకుఁ గుసుమాయుధుఁడయి
తన చెలికాండ్రకుఁ దంగేటిజున్నయి
           తమ్ములకెల్ల మోదప్రదుఁడయి
పేదయౌ జనముల పెన్నిధానంబయి
           యకలంకకీర్తిచే నతిశయిల్లె-

(నల్లందిగళ్ వారి వంశావళి - అముద్రితము. Government Oriental Manuscripts Library, Madras. R. No. 759 Pages 7 & 8.) పై యుధ్ధృతాంశమును బట్టి, శేషార్యుఁడు క్రీ. శ. 1704 - 1732 వఱకును మధురను పరిపాలించిన - సుప్రసిద్ధాంధ్రనాయకుఁడు విజయరంగ చొక్కనాథునికాలములో నున్నవాఁడని స్పష్టమగుచున్నది. కృతికర్తయగు అనంతయ, బాలకవి బిరుదాంకితుఁడు - ఈతఁడు తన గాధేయోపాఖ్యానమును బదిర కృష్ణభూపాలున కంకిత మిచ్చుచు, నందులో తన వంశవృక్షము నిట్లిచ్చియున్నాఁడు-

....................................రేవూరి కాళహస్తికవి
...............................................లింగకవి
కాళహస్తికవి.......అనంతకవి.......ఏకామ్రకవి.......గురువకవి.....శివానందకవి
.........................కాళహస్తికవి
..........................................అనంతకవి