పుట:శృంగారశాకుంతలము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

41

     ఠేవమై జిల్లకోల నాటించి యొక్కఁ
     [1]డేదుఁ గొనివచ్చెఁ గరిపురాధీశుకడకు.15
చ. అవి గనుఁగొంచు నెంతయుఁ బ్రహర్పషమునొందుచుఁ దానులీలఁగా
     నవిరళశక్తిఁ గాంచనసమంచితపుంఖశిలీముఖంబులం
     గవయవరాహదంతిరురుకాసరపఙ్క్తులఁ గూలనేయుచున్
     గదిసి తదీయకంఠములు ఖడ్గముఖంబునఁ దైవ్వనేయుచున్.16
క. వనచరులను జూచుచు నటఁ
     జన జనపతి కాంచె నొక్క చక్కని యిఱ్ఱి
     న్మునిపతి పెంపుడుబుఱ్ఱిని
     వనమునఁ జరియించువేళ వలపులకుట్టిన్.17
క. హరిణము నెఱిఁగని పుంఖిత
     శరుఁడై వెంబడిన యరిగె జనపతి కడిమి
     న్వరయజ్ఞమృగము వెంబడి
     నరిగెడు సాక్షాల్పినాకహస్తుడుపోలెన్.18
చ. విలుకొని వెంట వెంటఁ బృథివీపతి రా శరపాతభీతిఁ దా
     మలఁగి మలంగి కన్గొనుచు మార్గము క్రేవకు నడ్డగించుచు
     న్నిలుచుచుఁ గొంతకొంత గమనించుచు నర్ధము మేసి మేసి ద
     ర్భలు వివృతాస్యపార్శ్వముల రాలఁగ మింటికిఁ జౌకశించుచున్.19
సీ. శాలాంతరంబు మోసంటై న విడివడి
                    యరుదెంచు గాడ్పువాహనమృగంబొ
     శశముతో నొంటక జగతిపై వచ్చిన
                    చంద్రునిలోని లాంఛనమృగంబొ
     వీరభద్రుని కృపావీక్షణంబునఁ బున
                    ర్నవమై చరించు జన్నపు మృగంబొ

  1. డెద్దుగొనివచ్చె