పుట:శృంగారనైషధము (1951).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

39


బున విశ్రమించి రాయంచపలుకులు మనంబునం దలపోయుచుండె. గలహంసంబును నలుని వీడ్కొని భూమండలమండనాయితంబైన కుండిననగరంబుస కభిముఖంబై ప్రార్థనాసిద్ధిసూచకంబులగు ననుకూలగంధవాహాదినానావిధశుభనిమిత్తంబులను సంధించుచు నికషపాషాణపట్టనిభం బయిననభస్థలంబునం దసపసిండిఱెక్క లొరపెట్టుచందంబున నెందంబుగా ఝంకారితపతత్త్రధారావిహారంబుగ గోడివడి డిగ్గునప్పు డల దిగువ నున్నపతంగంబులు వడవడ వడంకుచు నొంటికంటఁ గనుంగొన నొక్కొక్కమాటు విధూతపక్షతియును నొక్కొక్కసారి యూర్ధ్వాయనదుర్విభావంబును నొక్కొక్కమాటు వితతీకృతనిశ్చలచ్ఛదగుచ్ఛంబును నగుచు వనంబులు గడచి శైలంబులు దాఁటి నదులు లంఘించి చని చని ముందట.

35


కుండిననగరవర్ణనము

ఉ.

అండజరాజు గాంచె లవణాంబుధివేష్టితమేదినీపధూ
కుండలమండనం బయినకుండినమున్ నిజకీర్తికల్పితా
ఖండలపట్టణప్రథితఖండనమున్ గ్రథకైశికేంద్రదో
ర్దండబలాభిగుప్తము సుదగ్రహిరణ్మయవప్రదీప్తమున్.

36


వ.

అప్పట్టణంబున కరిగి వప్రనదీప్రాకారంబు లగుప్రాకారంబులవలనను, నారసాతలగంభీరసలిలసంచారంబు లగుపరిఖాకూపారంబులవలనను, బ్రస్ఫుటస్ఫటికోపలవిగ్రహంబు లగుగృహంబులవలనను, శశిభిత్తివిమలభిత్తిసమత్సేధంబు లగుసౌధంబులవలనను, నింద్రనీలమణిచ్ఛాయాకల్పితాకాలకాలిక లగుచంద్రశాలికలవలనను, గేలీవిలోలబాలికాకుచ