పుట:శృంగారనైషధము (1951).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

261


కనకకలశభృంగారుతాలవృంతదర్పణతాంబూలపేటికాఫలకుసుమగంధకస్తూరికాదిపరికరోపశోభితంబును నగు కౌతుకాగారంబు ప్రవేశించి.

163


క.

వ్రీళాసరిన్నిమజ్జన
లీలోచితనమనసల్లలితముఖి యగుచున్
నేలఁ బదాంగుళి వ్రాయుచు
బాలామణి నిల్చెఁ దలిమపర్యంతమునన్.

164


ఉ.

భావము పల్లవింపఁ బువుఁబానుపుమీఁదికి నేర్పున న్వయ
స్యావలి దార్ప నెంతయును నర్మిలితోఁ గుసుమాస్త్రశాస్త్రవి
ద్యావిదుఁ డొయ్య బైఁదిగిచి యక్కునఁ జేర్చె భుజాయుగాంకపా
ళీవలయంబులోనఁ దవిలించి కురంగవిశాలలోచనన్.

165


క.

హారపరీక్షామిషమున
భూరమణుఁడు గమిచె నింతిపొంకపుఁజన్నుల్
కూరిమి నేరిమిఁ బులకాం
కూరంబులు వొడమఁ జిగురుఁగోరులకొనలన్.

166


చ.

శుచి యగుహారదామమున శుక్తిజరత్నవిభాపరీక్షణం
బుచితపుఁగైతవంబుగఁ బ్రియుండు ప్రియం బెసలారఁ జూచినం
గుచలికుచద్వయం బొరసికొంచుఁ బయిం బులకాంకురంబులం
బ్రచురము చేయుచు న్నిగిడె బాణి వధూమణికంఠసీమకున్.

167


తే.

నవసమాగమవేళ నయ్యవసరమున
నువిద లజ్జాభరంబున కోహటించి
యెదుపదిసేసె వలరాజునంతవాఁడు
నరయ నెవ్వానిసొమ్ము జయజయములు.

168